Ponguleti Srinivasa Reddy: ఎప్పుడు వచ్చామన్నదికాదన్నా.. శ్రీనన్నబుల్లెట్ కచ్చితంగా దిగుతుంది: పొంగులేటి వ్యాఖ్యలు

ఎప్పుడు వచ్చామన్నదికాదన్నా .. శ్రీనన్నబుల్లెట్ కచ్చితంగా దిగుతుంది అంటూ పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు.

Ponguleti Srinivasa Reddy: ఎప్పుడు వచ్చామన్నదికాదన్నా.. శ్రీనన్నబుల్లెట్ కచ్చితంగా దిగుతుంది:  పొంగులేటి వ్యాఖ్యలు

Ponguleti Srinivasa Reddy key comments on CM kcr

Ponguleti Srinivasa Reddy : సీఎం కేసీఆర్ పై పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేస్తు విమర్శలు సంధించారు. ఎప్పుడొచ్చాం అనేది కాదన్నా బుల్లెట్ దిగిందా? లేదా? అని పోకిరీ సినిమాలో డైలాగ్ ను కాస్త ఘాటుగా వేశారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తిగా ఉండటమే కాదు పార్టీనుంచి బయటకు వచ్చేశారు. బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న పొంగులేటి ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదు. బీజేపీలో చేరతారని, వైఎస్సార్ టీపీలో చేరతారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పొంగులేటి సినిమా డైలాగులతో మరోసారి వార్తల్లోకి వచ్చారు.

Pawan Kalyan Delhi Tour: ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీ పెద్దలతో భేటీ ..!

సోమవారం ఆయన అశ్వారావుపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఎప్పుడు వచ్చాం అనేది కాదు.. శ్రీనన్నా బులెట్ తప్పకుండా దిగుతోంది. ఆ బులెట్ కూడా ఖచ్చితంగా గుచ్చుకుంటోంది అది గుర్తుంచుకోండి.. శ్రీనన్న నిర్ణయం బులెట్ లాగా ఉంటుంది అంటూ బీఆర్ఎస్ పై సెటైర్ వేశారు. అలానే 30 సంవత్సరాలు ఇండ్రస్ట్రీ అని చెప్పుకోవడం కాదు. ప్రజలకు ఎం చేశారు.. మా తాతలు నేతి తాగారు అని చెప్పడం కాదు.. ఎప్పుడు వచ్చాం అనేది కాదు ఎన్ని మంచి పనులు చేశాం అనేది కావాలి అంటూ విరుచుకుపడ్డారు. రాబోయే రోజుల్లో నా విజయం అశ్వారావుపేట నుండే నా ప్రారంభమవుతుంది అంటూ వ్యాఖ్యానించారు.

తెలంగాణా రాష్ట్రం వస్తే మన బ్రతుకులు బాగుపడతాయని. కలలు కన్నాం..కానీ ఆ కలలు కల్లలుగానే మిగిలిపోయాయాయి ఇవి నగ్న సత్యాలు అని అన్నారు. మాటల గారిడితో రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ మూడోసారి కూడా సీఎం అవ్వటానికి ప్లాన్లు వేస్తున్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. మరో అయిదు నెలల్లో ఎన్నికలో రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రిని గద్దె దించాలని పిలుపునిచ్చారు.