Tribal Reservations: గిరిజన రిజర్వేషన్లు ఇక 10శాతం.. ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం..

రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ జీవో నెం.33ను విడుదల చేసింది.

Tribal Reservations: గిరిజన రిజర్వేషన్లు ఇక 10శాతం.. ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం..

CM KCR

Tribal Reservations: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ జీవో నెం.33ను జారీ చేసింది. చెల్లప్ప కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో గిరిజనుల ప్రత్యేక స్థితిగతులను పరిగణలోకి తీసుకొని వారికి రిజర్వేషన్లను పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి రానున్నాయి. విద్య, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు ఈ రిజర్వేషన్లు అమలుకానున్నాయి.

iPhone 14 Plus First Sale : వచ్చేవారమే భారత్‌లో ఐఫోన్ 14 Plus ఫస్ట్ సేల్.. ఇంతకీ ఈ ఐఫోన్ విలువైనదేనా? కొనాలా? వద్దా?

సీఎం కేసీఆర్ శుక్రవారం యాదాద్రి పర్యటన ముగించుకొని ప్రగతిభవన్ కు వచ్చిన వెంటనే ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై సమీక్షసమావేశం నిర్వహించి రిజర్వేషన్ల పెంపుపై ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో విద్య, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు 70శాతానికి చేరాయి. ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు (ఎ గ్రూపు-7, బి-10, సీ-1, డీ-7, ఇ-4)29, ఈడబ్ల్యూఎస్‌కు 10శాతం, క్రీడలు రెండు, వికలాంగులకు 4శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లను అమలుచేసేలా వారంరోజుల్లో జీవో విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశిస్తాం.. ప్రధాని మోదీ మా జీవోను అమలు చేయించి గౌరవం కాపాడుకుంటావాలంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే, కేసీఆర్ చెప్పినట్లుగా వారం రోజుల గడువు పూర్తికావడంతో శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత ఆఘమేఘాల మీద రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.