Omicron In India : భారత్ లో 36కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. కొత్తగా మరో మూడు గుర్తింపు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లోనూ కొత్త వేరియంట్ కలవర పెడుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి.

Omicron In India : భారత్ లో 36కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. కొత్తగా మరో మూడు గుర్తింపు

Omicron (3)

Three more Omicron cases : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లోనూ కొత్త వేరియంట్ కలవర పెడుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 36కు చేరింది.

చంఢీగఢ్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. ఇటలీ నుంచి వచ్చిన 20 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ గా నిర్ధారణ అయింది. కర్నాటకలో మరో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ గా నిర్ధారణ అయింది. కర్నాటకలో ఒమిక్రాన్ కేసులు మూడుకు చేరాయి.

ICMR : 2 గంటల్లోనే ఒమిక్రాన్ పరీక్ష ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లోనూ తొలి ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించంది. విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఐర్లాండ్ నుంచి ముంబై వచ్చిన ప్రయాణికుడికి ముంబైలో టెస్టు చేయగా కోవిడ్ నెగటివ్ వచ్చింది. దీంతో అతడు స్వగ్రామం వెళ్లారు.

విజయనగరంలో మరోసారి పరీక్ష చేయగా ఒమిక్రాన్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో స్థానికంగా ఆందోళన మొదలైంది. వెంటనే అలెర్ట్ అయిన అధికారులు ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతడిని కలిసిన వారిని గుర్తించి అధికారులు పరీక్షలు చేయనున్నారు.

Tablighi Jamaat : తబ్లిగీ జమాత్ పై సౌదీ అరేబియా నిషేధం

ఎవరూ ఆందోళన చెందవద్దని వైద్యారోగ్యశాఖ అధికారులు సూచించారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 36కు చేరింది.