Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్ ప్రమేయం లేకుండా ఏ స్కామ్ కూడా జరగలేదు, ఆంధ్రా వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇచ్చారు?-రేవంత్ రెడ్డి

టీఎస్ పీఎస్సీ లో ఆంధ్రాకు చెందిన ప్రవీణ్ కుమార్ కు ఎలా ఉద్యోగం ఇచ్చారు? కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ఎలా నియమిస్తారు? కేటీఆర్, కేసీఆర్ ప్రమేయం లేకుండా రాష్ట్రంలో ఏ కుంభకోణమూ జరగలేదు.

Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్ ప్రమేయం లేకుండా ఏ స్కామ్ కూడా జరగలేదు, ఆంధ్రా వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇచ్చారు?-రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విపక్ష నేతలు టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేశారు.

”తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబమో, బంధువులో, పార్టీ నేతల్లో ఒక్కరు కూడా ఆత్మ బలిదానం చేసుకోలేదు. 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నారు. అమరులు కలలుగన్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసమే. తొమ్మిదేళ్లయినా కేసీఆర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయలేదు.

Also Read..Minister KTR : పేపర్ లీకేజీ వెనుక ఎవరున్నా వదిలిపెట్టం.. బీజేపీపై అనుమానం : మంత్రి కేటీఆర్

కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో లక్షా 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ చెప్పారు. కానీ ఇవ్వలేదు. అంతేకాదు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. ఏ త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందో ఆ తెలంగాణలో మళ్లీ నిరుద్యోగ ఆత్మహత్యలు చూస్తున్నాం. తెలంగాణలో ఒక నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకుంటే తల్లిదండ్రులకు కడచూపు దక్కనివ్వలేదు.

మానవ మృగాల్లా బీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ సమాజం మానవత్వం కోల్పోయిందా? తెలంగాణ మేధావులు ఎక్కడున్నారు? సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత నిర్బంధం చూడలేదు. ఈ నిర్బంధాల కోసమేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది? టీఎస్ పీఎస్సీ లో ఆంధ్రాకు చెందిన ప్రవీణ్ కుమార్ కు ఎలా ఉద్యోగం ఇచ్చారు? సీఎం కేసీఆర్ ను సూటిగా ప్రశ్నిస్తున్నా? కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ఎలా నియమిస్తారు?

వందల కోట్ల రూపాయలకు లక్షలాది నిరుద్యోగుల జీవితాలను తాకట్టు పెట్టారు. కేటీఆర్, కేసీఆర్ ప్రమేయం లేకుండా రాష్ట్రంలో ఏ కుంభకోణమూ జరగలేదు. ఆనాడు ఇంటర్ బోర్డు సెక్రెటరీగా ఉన్న జనార్దన్ రెడ్డిని టీఎస్ పీఎస్సీ చైర్మన్ గా నియమించారు. వీరంతా కలిసి 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు.

Also Read..TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ లీక్ కేసులో నిందితుల రిమాండ్.. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు యువతులతో సంబంధాలు

ఆత్మహత్యలు వద్దు.. ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం. నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. మీ పక్షాన పోరాడుతుంది. కేసీఆర్ పరీక్షలు రద్దు చేయడం కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్నే నిరుద్యోగులు రద్దు చేసేందుకు సిద్ధంకండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 24, 25న విద్యార్థులు దీక్ష చేస్తామంటున్నారు. వారి దీక్షకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలి కేక వినిపించేందుకు సిద్ధం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం” అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.