Veera Simha Reddy: ఒంగోలు గడ్డమీదే ‘వీరసింహారెడ్డి’ వేడుక.. చోటు మాత్రమే మారింది..!

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా బాలయ్య మరోసారి తనదైన విశ్వరూపం చూపించేందుకు రెడీ అవుతున్నాడు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే శరవేగంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 6వ తేదీన ఒంగోలులోని AMB గ్రౌండ్స్‌లో నిర్వహిస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Veera Simha Reddy: ఒంగోలు గడ్డమీదే ‘వీరసింహారెడ్డి’ వేడుక.. చోటు మాత్రమే మారింది..!

Veera Simha Reddy Pre-Release Event To Be Held In Ongole Except Change In Venue

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా బాలయ్య మరోసారి తనదైన విశ్వరూపం చూపించేందుకు రెడీ అవుతున్నాడు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే శరవేగంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 6వ తేదీన ఒంగోలులోని AMB గ్రౌండ్స్‌లో నిర్వహిస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Veera Simha Reddy : వీరసింహారెడ్డిని అడ్డుకున్నామా.. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి!

కానీ ఏపీలో నెలకొన్న జీవో నెంబర్ 1 కారణంగా భారీ సభలకు పర్మిషన్ రిజెక్ట్ చేస్తుండటంతో వీరనరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్‌పై ఈ ప్రభావం పడింది. అయితే ఒంగోలులోని AMB గ్రౌండ్స్‌లో ఈ వేడుకకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, ఈ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని స్థానికుడు కావడంతో ఆయనకు తెలిసిన లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడి, ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఎలాగైనా ఒంగోలులోనే జరిగేలా చూసుకున్నాడు. దీంతో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు స్థలాన్ని మాత్రమే మారుస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది.

Veera Simha Reddy : ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికని మార్చుకోనున్న వీరసింహారెడ్డి..

ఒంగోలులోని అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్‌లో వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ముందుగా చెప్పిన రోజునే, చెప్పిన సమయానికే ఈ ఈవెంట్ జరుగుతుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. దీంతో నందమురి అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు. ఈ ఈవెంట్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వారందరూ ఆతృతగా ఉన్నారు. ఇక ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా ఎవరు వస్తారా అనే విషయంపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి క్లారిటీని ఇవ్వలేదు. కాగా, ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.