Maharashtra: ముంబైకి వెళ్తాం.. మా యాక్షన్ ప్లాన్ చెబుతాం: ఏక్‌నాథ్ షిండే

శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేలు అసోంలోని గువాహ‌టిలోని హోట‌ల్‌లో ఉంటూ బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వ ఏర్పాటుకు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో అక్క‌డి రాజ‌కీయాల్లో ఉత్కంఠ మ‌రింత పెరిగింది.

Maharashtra: ముంబైకి వెళ్తాం.. మా యాక్షన్ ప్లాన్ చెబుతాం: ఏక్‌నాథ్ షిండే

Maharashtra

Maharashtra: శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేలు అసోంలోని గువాహ‌టిలోని హోట‌ల్‌లో ఉంటూ బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వ ఏర్పాటుకు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో అక్క‌డి రాజ‌కీయాల్లో ఉత్కంఠ మ‌రింత పెరిగింది. మ‌హారాష్ట్ర(Maharashtra) మాజీ మంత్రి, శివ‌సేన‌ రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే రాడిసిన్ బ్లూ హోటల్ నుంచి బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. బాల్ ఠాక్రే హిందుత్వ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామ‌ని చెప్పారు.

Maharashtra Crisis: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ అడుగులు

ఇందులో ఎటువంటి సందేహాలూ వ‌ద్ద‌ని అన్నారు. తామంతా శివసేన వారసులమ‌ని, శివసేన ఎప్పటికీ త‌మదేన‌ని చెప్పుకొచ్చారు. తామంతా కలిసి త్వరలో ముంబైకి వెళ్తామ‌ని, త్వరలో త‌మ‌ యాక్షన్ ప్లాన్ చెబుతామ‌ని ప్ర‌క‌టించారు. కాసేప‌ట్లో ఆయ‌న గువాహ‌టి నుంచి ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ఢిల్లీకి చేరుకున్నారు.