Aishwarya Dhanush: ధనుష్, ఐశ్వర్య విడాకులకు కారణమిదేనా? మళ్ళీ కలుస్తారా?

18ఏళ్లు కలిసున్నారు. ఇద్దరు పిల్లలున్నారు. రీసెంట్గా హైదరాబాద్ లో మూవీ షూటింగ్ స్పాట్ కి కలిసే వచ్చారు. అయితే ఇలా సడెన్ గా విడిపోతున్నట్టు ప్రకటించి, ఇండస్ట్రీకే పెద్ద షాకిచ్చారు.

Aishwarya Dhanush: ధనుష్, ఐశ్వర్య విడాకులకు కారణమిదేనా? మళ్ళీ కలుస్తారా?

Aishwarya Dhanush

Aishwarya Dhanush: 18ఏళ్లు కలిసున్నారు. ఇద్దరు పిల్లలున్నారు. రీసెంట్గా హైదరాబాద్ లో మూవీ షూటింగ్ స్పాట్ కి కలిసే వచ్చారు. అయితే ఇలా సడెన్ గా విడిపోతున్నట్టు ప్రకటించి, ఇండస్ట్రీకే పెద్ద షాకిచ్చారు ఐశ్వర్య, ధనుష్. అసలు వీళ్లు విడిపోవడానికి రీజన్స్ ఏంటి? వీళ్లు విడిపోతే ఫాన్స్, ఫామిలీ మెంబర్స్ ఎలా రియాక్టవుతున్నారు?. ఇలా గత మూడు రోజులుగా తమిళ మీడియా నుండి నేషనల్ మీడియా వరకు ఎన్నో పోస్ట్ మార్టం చర్చలు చేసి ఈ విషయానికి గల కారణాలేంటి అని వెలికి తీస్తున్నారు.

Dhanush-Aishwarya : 21 ఏళ్లకే ధనుష్‌కి పెళ్లి.. ఐశ్వర్య‌కి ఎంత ఏజ్ తెలుసా??

నిజానికి ఐశ్వర్య, ధనుష్ ముందు ఫ్రెండ్స్, ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా జీవితాంతం కలిసుండలేక పోయారు. గత కొన్ని రోజులుగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ విడిపోతున్నట్టుగా వార్తలొచ్చాయి. అవన్నీ పుకారులని అభిమానులు కొట్టి పారేస్తూ వచ్చారు. కానీ, ప్రస్తుతం వాళ్లు విడిపోయి అందరికీ షాకిచ్చారు. ధనుష్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించడానకి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఐశ్వర్య కూడా డైరెక్షన్, సింగింగ్ పైన పాషన్ తో ఇండస్ట్రీలో ఉంది. ధనుష్ హీరోగా ఐశ్వర్య డైరెక్షన్లో వచ్చిందే త్రి సినిమా.

Dhanush : అటు అన్నదమ్ములు.. ఇటు అక్క చెల్లెళ్లు.. విడాకుల పర్వం

కొన్నేళ్ల నుంచే ఐశ్వర్య, ధనుష్ ల మధ్య అభిప్రాయ భేదాలున్నాయని తెలుస్తోంది. కానీ, ఎప్పటికప్పుడు రజనీ నచ్చచెప్తుండటంలో ఇన్నాళ్లు కాపురం చేసారనేది టాక్. రీసెంట్ గా తండ్రి సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నాడు. అదే టైమ్ లో తన భర్త ధనుష్ నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. ఇద్దరూ నా వాళ్లే అని పొంగిపోయింది ఐశ్వర్య. రీసెంట్ గా రజనీకాంత్ అస్వస్థతకు గురై అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ధనుష్ దగ్గరుండి సపర్యలు చేశాడు. అంతా బాగానే ఉన్నా ఇంతలోనే బ్రేకప్ అనేశారు.

Dhanush : ధనుష్ హీరో.. నిర్మాతగా త్రివిక్రమ్ సతీమణి

కొన్నేళ్ల క్రితం పెద్ద ఇష్యూ అయిన సుచీలీక్స్ లో ధనుష్, ఇద్దరు హీరోయన్స్ తో సన్నిహితంగా ఉన్నట్టు ఫోటోలు బయటకొచ్చాయి. అప్పుడే ధనుష్, ఐశ్వర్యల మధ్య విభేదాలొచ్చాయనేది సమాచారం. ఆ తర్వాత నిర్మాతగా కాలా సినిమాకు నష్టం వచ్చినప్పుడు మామ ఆదుకోలేదనే అక్కసు కూడా ధనుష్ కుందని కొందరు చెప్తున్నారు. ఆపై ధనుష్ తో పాన్ ఇండియా సినిమా తీయాలనుకున్న ఐశ్వర్యకు భర్త ఛాన్స్ ఇవ్వలేదనే పుకారూ ఉంది. హీరోయిన్స్ తో చనువుగా వ్యవహరించడమే కారణమా? ఈగో ఇష్యూస్ క్లాషెస్ తీసుకొచ్చాయా అన్నది ప్రస్తుతానికైతే ప్రశ్నల్లాగే మిగిలాయి.

Ravanasura: మాస్ రాజాతో ఆట పాట.. ఒకే సినిమాలో ఐదుగురు హీరోయిన్స్!

కాగా.. తమిళ మీడియాతో ధనుష్-ఐశ్వర్యల విడాకుల గురించి మాట్లాడిన ధనుష్ తండ్రి.. ప్రముఖ డైరెక్టర్ కస్తూరి రాజా.. ధనుష్, ఐశ్వర్యల మధ్య మనస్పర్ధలు వచ్చాయని, అందుకే వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం వారు ఇద్దరూ చెన్నైలో లేరని.. వారు చెన్నైకి వచ్చాక నేను, రజినీకాంత్ వారిద్దర్నీ కూర్చోబెట్టి మాట్లాడతామని, త్వరలోనే మళ్ళీ వారిద్దరు కలిసి బతుకుతారనే వార్త వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ధనుష్ తండ్రి ఈ మాట చెప్పడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇది ఎంతవరకు నిజం అవుతుందన్నది చూడాలి.