YS Sharmila : కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అంటూ సీబీఐ డెరెక్టర్‌కు ఫిర్యాదు చేసిన YS షర్మిల

YS షర్మిల అన్నంత పనీ చేశారు. ఢిల్లీ వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అంటూ సీబీఐ డెరెక్టర్‌కు ఫిర్యాదు చేసారు.

YS Sharmila : కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అంటూ సీబీఐ డెరెక్టర్‌కు ఫిర్యాదు చేసిన YS షర్మిల

YSRTP chief YS Sharmila who complained to CBI director that there was corruption in Kaleswaram project

YS Sharmila : తెలంగాణలో తండ్రి వైఎస్ఆర్ పేరుతో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది సీఎం కేసీఆర్ రూ.70 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలి డిమాండ్ చేశారు. YS షర్మిల కేవలం ఆరోపణలతో సరిపెట్టకుండా ఏకంగా సీఎం కేసీఆర్‌పై సీబీఐకు ఫిర్యాదు చేయటానికి ఢిల్లీ వెళ్లారు. సీబీఐ డెరెక్టర్‌ను కలిసారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందనీ..ఈ అవినీతికి పాల్పడినవారి(టీఆర్ఎస్ ప్రభుత్వం)పై విచారణ జరిపాలి అని కోరుతూ సీబీఐకు ఫిర్యాదు చేశారు వైఎస్ షర్మిల. సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై సిబిఐ విచారణ జరపాలని కేంద్రాన్ని కోరినట్లుగా తెలుస్తోంది.

వైఎస్సార్ టీపీ పెట్టిన తరువాత షర్మిల తొలిసారి ఢిల్లీ వెళ్లారు. తొలిసారి వెళ్లటంతోనే ఏకంగా సీఎం కేసీఆర్ పై సీబీఐకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఢిల్లీ పెద్దలతో భేటీకానున్నారు. కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు షర్మిల. కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా షర్మిల భేటీకానున్నారు.అనంతరం మధ్యాహ్నాం 2.30గంటలకు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించానున్నారు వైఎస్ షర్మిల.

కాగా..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.70 కోట్ల అవినీతి జరిగిందని దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ లో ఎర్రమంజిల్‌లోని జలసౌధ ముందు బైఠాయించి వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై గవర్నర్ తమిళిసైను కూడా కలిసి వినతిపత్రం సమర్పించారు షర్మిల.

కాగా..షర్మిల ఢిల్లీ వెళ్లటం వెనుక ఆసక్తి కర రాజకీయం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ వేదికగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్న క్రమంలో సీఎం కేసీఆర్ జాతీయ ప్రకటన వేళ.. షర్మిల కీలక అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ పార్టీ స్థాపించిన షర్మిల పాదయాత్రలో కేసీఆర్ ను టార్గెట్ చేస్తు పలు విమర్శలు సంధిస్తున్నారు. ఇప్పటికే 2500 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన షర్మిల చిన్న బ్రేక్ తీసుకుని ఈరోజు (అక్టోబర్ 7,2022)న ఢిల్లీ వెళ్లారు. పార్టీ ఏర్పాటు తరువాత షర్మిల ఈ సమయంలో ఢిల్లీ వెళ్లటం రాజకీయంగా అనేక చర్చలకు కారణమవుతోంది. షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీలో కీలక నేతల చేరికలు లేవు. షర్మిల వాయిస్ ఒక్కటే పార్టీలో వినిపిస్తోంది. ఈ క్రమంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాలు – టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును టార్గెట్ చేస్తూ షర్మిల ప్రజల్లోకి వెళ్తున్నారు. అదే సమయంలో పదే పదే కేసీఆర్ పాలనలో అవినీతి జరిగిందంటూ విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా దీనిపై సీబీఐకు ఫిర్యాదు చేశారు షర్మిల.

కాగా..షర్మిలకు ఢిల్లీ రావాలంటూ ఆహ్వానం అందింది అని అందుకే ఆమె ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరుగుతోంది. షర్మిల ఢిల్లీ వెళ్తున్నారనే అంశం మినహా..ఇతర విషయాలు మాత్రం బయటకు రాలేదు. కేసీఆర్ ప్రభుత్వం పై ఇప్పటికే బీజేపీ చేసిన ఆరోపణలనే ఇప్పుడు షర్మిల కొనసాగిస్తున్నారు. అంటే షర్మిల బీజేపీతో దోస్తీకి సై అంటున్నట్లుగా తెలుస్తోంది. షర్మిల ఫిర్యాదుల ఆధారంగా కేంద్ర సంస్థలు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని..దీంతో షర్మిల పర్యటన రాజకీయంగా తెలంగాణలో కొత్త సమీకరణాలకు కారణం కానుందని తెలుస్తోంది. మరి మధ్యాహ్నాం మీడియా సమావేశంలో షర్మిల ఏఏ విషయాలు చెబుతారోననే విషయం ఆసక్తికరంగా మారింది.