Dinner : సూర్యాస్తమయానికి ముందే రాత్రిభోజనం ఎందుకంటే?
శరీరం పగటిపూట తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం, జీర్ణమయిన దానిని అన్ని భాగాలకు అందించడం, శ్రమకు తగ్గ శక్తిని ఇస్తూ ఉండటం దీని పని.

Dinner : ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి పడుకునే వరకూ ఖాళీ దొరికినప్పుడల్లా ఆకలి లేకపోయినా పొట్టలో ఏదో ఒకటి నింపటం మనిషికి అలవాటైంది. భూమి మీద ఉన్న ప్రాణులలో కొన్ని పగలు తిని, పగలు తిరిగేవి ఉంటే, మరికొన్ని రాత్రికి మాత్రమే తిని, రాత్రులే తిరుగుతూ ఉంటాయి. పగలు తిరిగే ప్రాణి రాత్రికి విశ్రాంతి తీసుకుంటే, రాత్రి తిరిగే ప్రాణి పగటి పూట విశ్రాంతి తీసుకుంటుంది. మనిషిమాత్రం పగలు శ్రమించి, రాత్రికి విశ్రమించాలి. కానీ ఉదయం తినడం ప్రారంభించి పగలు తిన్నది చాలక అర్ధరాత్రి వరకూ ఎదోఒకటి తింటునే ఉంటాడు.
రాత్రి భోజనం విషయంలో చాలా మంది రకరకాల రుచులు కోరుకుంటుంటారు. మాంసాహార వంటలు, పలావులు, ఫ్రైడ్ రైసులు, బీరులు, బ్రాందీలు అన్నీ రాత్రిపూట తినడానికే ఎక్కవ ప్రాధాన్యతను ఇస్తుంటారు. పొట్ట కొన్ని గంటలు పనిచేస్తే, కొన్ని గంటలు విశ్రాంతి తీసుకోవలసిన అవసరం ఉంది. 12 గంటలు పనిచేసి, 12 గంటలు విశ్రాంతి తీసుకోవలసిన పొట్టకు విశ్రాంతే కరువయ్యింది. సహజాహారానికి బదులు అసహజాహారం తీసుకోవడం, అదీ అర్ధరాత్రి వరకు తినడం వలన వివిధ రకాల ఆరోగ్యసమస్యలు వస్తున్నాయి.
శరీరం పగటిపూట తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం, జీర్ణమయిన దానిని అన్ని భాగాలకు అందించడం, శ్రమకు తగ్గ శక్తిని ఇస్తూ ఉండటం దీని పని. రాత్రికి విశ్రాంతి సమయంలో రిపేరు చేసుకోవడం, క్రొత్త కణాలను నిర్మించుకోవడం, మాలిన్యాలను విసర్జించుకోవడం చేస్తుంది. మనం సరైన విశ్రాంతిని ఇవ్వకపోతే ఈ కార్యక్రమాలు ఆగిపోయి అనారోగ్యసమస్యలు తలెత్తుతాయి. అందుకే మన పెద్దలు సూర్యాస్తమయానికి ముందు భోజనం చేయడం మంచిదని చెప్తుండేవారు. ప్రస్తుతం రాత్రి సమయంలో వేళాపాళలేకుండా భోజనం చేసేవారే ఎక్కవ…భోజనం చేసేదే రాత్రి 8-9 గంటలకు. ఉప్పు, కారం నూనెలు వేసిన కూరలు జీర్ణంకావటానికి రాత్రి పూట 6 గంటల సమయం పడుతుంది. అంటే ఆ ఆహారం జీర్ణం అయ్యేసరికే తెల్లవారుజామున 3-4 గంటలు అయిపోతుంది. ఇక ప్రేగులకు విశ్రాంతి దొరికేది 2-3 గంటలు మాత్రమే..
మనం రోజుకి 2-3 గంటలు విశ్రాంతి తీసుకుంటే మనకు ఎంత అలసటగా, బడలికగా ఉంటుందో, అలాగే ప్రేగుల పరిస్థితి కూడా ఉంటుంది. ఒక్కరోజు తిండి లేకపోయినా శరీరం దెబ్బతినదు, అయితే ఒక్కరోజు దేహం నుండి బయటకు వెళ్ళవలసిన చెడు నిలువ ఉండటం వలన రోగాలు కొనితెచ్చుకోవాల్సి వస్తుంది. మనం రాత్రికి 6-7 గంటలు నిద్ర ద్వారా విశ్రాంతి తీసుకొంటే 18 గంటలు పనిచేయడానికి శక్తి ఉంటుంది. ఆహారం తిన్నాగానీ రాత్రికి విశ్రాంతి లేకపోతే ఏపనిగి శరీరం సహకరించదు. ప్రేగులు కూడా ఇలాగే విశ్రాంతి లేకుండా 24 గంటలు పనిచేస్తే శక్తిని కోల్పోతాయి. విశ్రాంతి లేని శరీరం వ్యర్థ పదార్థాలను నిలువ చేసుకుంటుంది. ఈ పరిస్ధితి చివరకు చిన్నచిన్న వ్యాదులతో ప్రారంభమై అంతిమంగా దీర్ఘకాలిక రోగాలకు పరిస్ధితి దారితీయవచ్చు. అందుకే సూర్యస్తమయానికి ముందే భోజనం చేయటం అలవాటు చేసుకోవటం మంచిది.
1Major: పవన్ కోసం స్పెషల్.. పక్కా అంటోన్న మేజర్!
2సామాజిక న్యాయ భేరి మోగించిన వైసీపీ
3RBI New Guidelines : బంగారం దిగుమతులపై ఆర్బీఐ కొత్త రూల్స్.. వారికి మాత్రమేనట..!
4Vaani Kapoor: స్టన్నింగ్ లుక్స్తో వాణీ కపూర్ హాట్ పిక్స్!
5నేను ఇటు.. నువ్వు అటు..
6TS Politics : హ్యాట్రిక్ కొట్టేందుకు పక్కా ప్లాన్ మీదున్న సీఎం కేసీఆర్..ఎంపీ స్థానాల పెంపుపై కసరత్తులు..
7పెట్టుబడులే లక్ష్యం.. సీఎం జగన్ దావోస్ పర్యటన
8పోలీస్ దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు
9శ్రీకాకుళం నుండి వైసీపీ బస్సు యాత్ర
10India corona: మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు.. నిన్నటికంటే 24శాతం అధికం
-
Raviteja: రామారావు డ్యూటీ ఎక్కడం మరింత ఆలస్యం!
-
Revanth Letter PM Modi : ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చులకన?
-
NTR: కొరటాల కోసం ఎన్టీఆర్ మార్పులు..!
-
Salaar: ప్రభాస్ ఫ్యాన్స్కు ఎదురుచూపులు తప్పవా..?
-
Minister KTR Davos : మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన..తెలంగాణకు పెట్టుబడుల వరద
-
Mahesh Babu: మహేష్ సినిమాలో నందమూరి హీరో.. ఇక బాక్సులు బద్దలే!
-
Supreme Court : సెక్స్ వర్కర్లను వేధించొద్దు.. మీడియా, పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం!
-
Murder : రూ.500 కోసం ప్రాణం తీశాడు