అప్పుడు వర్షిణీ.. ఇప్పుడు పూర్ణ: ‘ఢీ’ షోలో కంటెస్టెంట్ బుగ్గ కొరికిన జడ్జ్
బుల్లితెర మీద ఏదైనా అవకాశం వస్తే చాలు పాపులారిటీ పెంచుకునేందుకు ప్లాన్ చేసేసుకుంటారు కొంతమంది అయితే అవి కొన్నిసార్లు విమర్శలకు కారణం అవుతూ ఉంటాయి. ఇటీవల పటాస్ ‘షో’లో యాంకర్ వర్షణీ షో చూడడానికి వచ్చిన అభిమానిని పిలిచి బుగ్గ మీద కొరికేసింది.
అప్పుడు ఆ సీన్ నెట్టింట్లో వైరల్ అయ్యింది. కొంతమంది ఆమెకు నెగెటివ్గా కామెంట్లు కూడా చేశారు. అయితే అది పెద్ద విషయం కాలేదు. లేటెస్ట్గా యాంకర్గా ప్రదీప్, టీమ్ లీడర్స్గా రష్మి-సుడిగాలి సుధీర్, జడ్జెస్గా పూర్ణ, శేఖర్ మాస్టర్లు వ్యవహరిస్తున్న ‘ఢీ’ షోలో మరోసాని ఇటువంటి సంఘటనే జరిగింది.
ఢీ 12వ సీజన్లో జడ్జ్గా ఉన్న పూర్ణ. ఒక కంటెస్టెంట్ని పిలిచి బుగ్గ కోరికేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే వీళ్ళు క్రేజ్ కోసం ఇంటెన్షనల్గా చేస్తున్నారా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు.