Akhanda : ‘అఖండ’ సినిమా చూస్తూ డిస్ట్రిబ్యూటర్ మృతి
ఇలాంటి సమయంలో ఓ బాలయ్య బాబు అభిమాని, డిస్ట్రిబ్యూటర్ 'అఖండ' సినిమా చూస్తూ హఠాన్మరణం చెందారు. తూర్పుగోదావరి జిల్లా సినీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ....
Akhanda : గత మూడు రోజుల నుంచి ‘అఖండ’ జోరు తగ్గట్లేదు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూడో సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ విదేశాల్లో కూడా ‘అఖండ’ సినిమా కొత్త రికార్డ్స్ ని సృష్టిస్తుంది. బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాక అన్ని హీరోల ఫ్యాన్స్ ఈ సినిమాకి ఫిదా అయిపోయారు. బాలయ్యబాబు బోయపాటితో పాటు ఈ సినిమా విజయానికి ముఖ్య కారకుడు తమన్ ని పొగిడేస్తున్నారు అభిమానులు. అన్ని థియేటర్స్ వద్ద సంబరాలు జరుపుకుంటున్నారు.
అయితే ఇలాంటి సమయంలో ఓ బాలయ్య బాబు అభిమాని, డిస్ట్రిబ్యూటర్ ‘అఖండ’ సినిమా చూస్తూ హఠాన్మరణం చెందారు. తూర్పుగోదావరి జిల్లా సినీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ సినీ ఎగ్జిబిటర్ అయిన జాస్తి రామకృష్ణ రాజమండ్రిలోని శ్యామల థియేటర్లో ‘అఖండ’ సినిమా చూస్తూ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. అయితే వెంటనే హాస్పిటల్ కి తీసువెళ్లారు. కానీ ఈ మార్గ మధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు.
Samantha : జీవితంలో చాలా నేర్చుకున్నా.. పట్టుకోవడం కంటే వదిలేయడం బెటర్ అంటున్న సమంత
రాజమండ్రి సమీపంలో ఉన్న నామవరం వీఎస్ మహల్ థియేటర్ ఓనర్గా కెరీర్ను ప్రారంభించి తర్వాత డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగి జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మారి ఆ తర్వాత వింటేజ్ క్రియేషన్స్ అధినేతగా రామకృష్ణ ఎదిగారు. ఈయన బాలయ్యకు వీరాభిమాని. ‘అఖండ’ సినిమా చూస్తూనే అతను మరణించడం అందరిలోనూ విషాదాన్ని నింపింది. జిల్లా ప్రముఖులు, బాలయ్య అభిమాన సంఘాలు, డిస్ట్రిబ్యూటర్స్ రామకృష్ణకు నివాళులు అర్పిస్తున్నారు.