ఈడీ విచారణకు రియా ఎవరి కారులో వెళ్లిందో తెలుసా?!

  • Published By: bheemraj ,Published On : August 7, 2020 / 09:45 PM IST
ఈడీ విచారణకు రియా ఎవరి కారులో వెళ్లిందో తెలుసా?!

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు దర్యాప్తులో భాగంగా రియా చక్రవర్తి శుక్రవారం (ఆగష్టు 7) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణకు రియా తన సోదరుడు షోయిక్‌ చక్రవర్తితో కలిసి ఈడీ కార్యాలయాని​కి అత్యంత ఖరీదైన ఫోర్డ్ ఎడీవోర్‌లో కారులో వెళ్లారు. దీంతో రియాకు అంత ఖరీదైన లగ్జరీ కారు ఎక్కడదనే దానిపై ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి.



అయితే రియా వెళ్లిన ఆ కారు ఆమెది కాదని వెల్లడైంది. ముంబైకి చెందిన ప్రముఖ స్టార్‌ హోటల్స్‌ వ్యవస్థాపకుడు సువేద్ లోహియాదిగా తెలుస్తోంది. అతడు సల్మాన్ ఖాన్ 2014 చిత్రం ‘జై హో’లో ఓ చిన్న పాత్రను పోషించాడు. అభిషేక్ కపూర్ ‘ఆర్యన్: అన్‌ బ్రేకబుల్‌’లో కూడా నటించాడు. అయితే సువేద్‌ చిత్ర పరిశ్రమలో చాలా మందికి సుపరిచితుడు. వివిధ కార్యక్రమాల్లో నటీనటులతో కలిసి తీసుకున్న ఫొటోలను తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటాడు.



సుశాంత్‌కు సువేద్‌ మంచి స్నేహితుడని కూడా తెలుస్తోంది. ఇటీవల సుశాంత్‌ చనిపోయిన నెల రోజులకు (జూలై 14) సువేద్‌ సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్టును పంచుకున్నాడు. సుశాంత్‌ తనకు ఎంత మంచి స్నేహితుడో గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘‘నేను ఆకాశం వైపు చూసినప్పుడు ఆ మేఘాల మధ్య నువ్వు ఉన్నావని తెలుసు. అప్పుడు అది ఎంతో ఆకర్షనీయంగా తయారైంది. మీ కల్లలో పాలపుంత. నక్షత్రాలు మీ నరాల్లో నృత్యం చేస్తున్నాయి. విశ్వమంతా నువ్వే ఉన్నావు!!! నువ్వు ఈ లోకాన్ని విడిచి ఒక నెల గడిచిపోయింది. కానీ ఇప్పటికీ మిమ్మల్ని మిస్‌ అవుతున్నాము.. మిస్ యు భాయ్’’ అంటూ సుశాంత్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు.



అదే విధంగా సుశాంత్‌ ఆత్మహత్య అనంతరం సూవేద్‌ ‘నువ్వు నాకు జీవితాంతం మచ్చను మిగిల్చావు’ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు.