విరాళమిచ్చినా విమర్శలు తప్పడం లేదు .. అంత సంపాదించి ఇంతేనా ఇచ్చేది?..

కరోనా క్రైసిస్ చారిటీకి రెండు లక్షలు విరాళమిచ్చిన కాజల్ అగర్వాల్..

  • Published By: sekhar ,Published On : April 16, 2020 / 01:43 PM IST
విరాళమిచ్చినా విమర్శలు తప్పడం లేదు .. అంత సంపాదించి ఇంతేనా ఇచ్చేది?..

కరోనా క్రైసిస్ చారిటీకి రెండు లక్షలు విరాళమిచ్చిన కాజల్ అగర్వాల్..

లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ (CCC) ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ చారిటీకి పలువురు సినీ ప్రముఖులు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు. 
తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా తన వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. రూ.2 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించిందామె. ఆర్టీజీఎస్ ద్వారా సీసీసీకి డబ్బు అందించినట్టు కాజల్ మేనేజర్ తెలిపారు. ఇదిలా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తూ సినీ కళాకారులను, కార్మికులను ఆదుకోవడానికి కథానాయికలెవరూ ముందుకు రావడం లేదని బ్రహ్మాజీ వంటి పలువురు ఆరోపించారు.

Read Also : ప్రియుణ్ణి పెళ్లాడిన పూజా.. వేడుక డబ్బంతా వారికే విరాళం..

కాగా CCCకి ఇంతకుముందు లావణ్య త్రిపాఠి, ప్రణీత చెరో లక్ష రూపాయల విరాళమిచ్చారు. అయితే సౌత్‌లో స్టార్ కథానాయికగా కొనసాగుతూ సినిమాకు రూ.కోటి వరకు పారితోషికం తీసుకునే కాజల్ కేవలం రెండు లక్షలు ఇవ్వడమేంటి అనే మాటలు కూడా వినబడుతున్నాయి. పోనీలే మొత్తానికి సినీ పరిశ్రమ వారిని ఆదుకోవడానికి కథానాయికలు కూడా కదులుతున్నారు సంతోషం వంటి నిట్టూర్పులు కూడా వినిపిస్తున్నాయి.