జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బాలయ్య

  • Published By: sekhar ,Published On : August 15, 2020 / 01:58 PM IST
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బాలయ్య

టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కు చెందిన సెల‌బ్రిటీలు త‌మ సామాజిక మాధ్యమాల ద్వారా 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఈ సందర్భంగా అమ‌ర‌వీరుల త్యాగాలు గుర్తు చేసుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని వారు పేర్కొన్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.



‘ఎన్నో ఏళ్ల పాటు ఆంగ్లేయుల బానిస సంకెళ్లలో నలిగిపోయిన భారతావనిని వారి కబంధ హస్తాల నుండి విడిపించి.. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అశువులు బాసిన ఎందరో సమరయోధుల త్యాగ దీక్షా దక్షతలను స్మరించుకుంటూ… స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు’ తెలియ‌జేశారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా బారిన పడకుండా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు బాలకృష్ణ.



Balayya