Trisha : త్రిష, మణిరత్నంపై పోలీసులకు ఫిర్యాదు

నటి త్రిష, దర్శకుడు మణిరత్నంను అరెస్ట్ చేయాలనీ హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. షూటింగ్ సమయంలో త్రిష హిందూ దేవాలయంలో చెప్పులు వేసుకొని తిరగరాని ఫిర్యాదు చేశారు.

Trisha : త్రిష, మణిరత్నంపై పోలీసులకు ఫిర్యాదు

Trisha

Trisha : నటి త్రిష, దర్శకుడు మణిరత్నంను అరెస్ట్ చేయాలనీ హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇండోర్ లో జరుగుతుంది. శుక్రవారం శివలింగం, నంది విగ్రహాల మధ్యనుంచి నడిచే సీన్ ను చిత్రీకరించారు. ఈ సమయంలో త్రిష చెప్పులు వేసుకొని, శివలింగం, నంది విగ్రహాల మధ్యలోంచి నడిచి వెళ్ళింది

ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. త్రిష చెప్పులు వేసుకొని దేవుడి విగ్రహం మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్లడంపై హిందూ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా దర్శకుడు మణిరత్నం, నటి త్రిషపై కేసు నమోదు చేసి అరెస్ట్ చెయ్యాలని హరికేష్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రం విషయంలో ఇప్పటికే మణిరత్నంపై ఓ కేసు నమోదైంది. హైదరాబాద్ శివారు, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెలలో ఈ సినిమా షూటింగ్ నిర్వహించారు. షూటింగ్ సమయంలో ఓ గుర్రం డీహైడ్రేషన్ కు గురై మృతి చెందింది. అయితే గుట్టుచప్పుడు కాకుండా గుర్రాన్ని పూడ్చిపెట్టారు. ఈ వ్యవహారం పెటాకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.