Adipurush : సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ప్రభాస్.. ఆదిపురుష్ పోస్ట్‌పోన్.. ఎందుకో??

ఆదిపురుష్ ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చలేదు. ప్రభాస్ తప్ప ప్రతి క్యారెక్టర్ ని తప్పు పట్టారు జనాలు. చిత్ర యూనిట్ పై బాగా విమర్శలు వచ్చాయి. టీజర్ ని అంతా ట్రోల్ చేశారు................

Adipurush : సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ప్రభాస్.. ఆదిపురుష్ పోస్ట్‌పోన్.. ఎందుకో??

Prabhas Adipurush movie postponed

Adipurush :  ప్రభాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆదిపురుష్ పోస్ట్ పోన్ అవుతోందంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. సంక్రాంతి రిలీజ్ అని అందరికంటే ముందే ఖర్చీఫ్ వేసుకున్న ప్రభాస్ ఇప్పుడు పొంగల్ రేసులోనుంచి తప్పుకుంటున్నట్టు సమాచారం. బాలీవుడ్ మీడియా కూడా ఇదే అంటుంది.

పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ అవెయిటింగ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ ప్లాన్ మారుస్తోంది. ఈ సంవత్సరం ఆగస్ట్ కి రిలీజ్ అవ్వాల్సిన ఆదిపురుష్ సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆదిపురుష్ సంక్రాంతి నుంచి ఏకంగా సమ్మర్ కి జంప్ అయ్యినట్టు నేషనల్ వైడ్ గా టాక్ వినిపిస్తుంది. సంక్రాంతి ఫైట్ గట్టిగా ఉంది కాబట్టి రిలీజ్ పోస్ట్ పోన్ అవుతోందంటూ టాక్ వినిపిస్తోంది కానీ అసలు కారణం వేరే ఉందని సమాచారం.

 

నిజానికి సంక్రాంతి రిలీజ్ అంత ప్లాన్ లేకుండా పోస్ట్ పోన్ చెయ్యలేదు ఆదిపురుష్ టీమ్. పాన్ ఇండియా వైడ్ గా 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా సౌత్ సపోర్ట్ ఎలాగూ ఉంటుంది నార్త్ లో కలెక్షన్లు కూడా గట్టిగా రావాలంటే ఏ సినిమాలు పోటీ ఉండకూడదు. అందుకే బాలీవుడ్ లో డ్రై సీజన్ అయిన సంక్రాంతినే రిలీజ్ కి ఫిక్స్ చేసుకున్నారు ఆదిపురుష్ టీమ్. ఇంత పక్కాగా ప్లాన్ చేసుకున్న ఆదిపురుష్ అర్దాంతరంగా పోస్ట్ పోన్ అంటున్నారు.

సంక్రాంతికి సౌత్ లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయని, తెలుగులో చిరంజీవి, బాలయ్య తో పాటు తమిళ్ లో అజిత్, విజయ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి కలెక్షన్లు తగ్గుతాయని పోస్ట్ పోన్ చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు. సంక్రాంతికి సౌత్ లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయన్న విషయం అందరకీ తెలిసిందే. మరి సడెన్ గా పెద్ద సినమాలు రిలీజ్, ఓపెనింగ్స్ తగ్గుతాయన్న లాజిక్ ఏంటో ఎవ్వరికీ అర్దం కావడం లేదు.

Rambha : రంభ కారుకి యాక్సిడెంట్.. హాస్పిటల్‌లో రంభ కూతురు.. మా కోసం ప్రార్ధించండి అంటూ ఎమోషనల్ పోస్ట్

అయితే అసలు సంగతి అదిమాత్రం కాదంటున్నారు. 450కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చలేదు. ప్రభాస్ తప్ప ప్రతి క్యారెక్టర్ ని తప్పు పట్టారు జనాలు. చిత్ర యూనిట్ పై బాగా విమర్శలు వచ్చాయి. టీజర్ ని అంతా ట్రోల్ చేశారు. టీజర్ రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే గ్రాఫికల్ ఛేంజెస్ తో పాటు సీజీవర్క్ కి బెటర్ మెంట్స్ చేయ్యడానికే సినమా పోస్ట్ పోన్ చేస్తున్నట్టు టాక్. అలాగే సంక్రాంతికి కాకుండా రాముడి సినిమా కాబట్టి సినిమాకి రిలేట్ అయ్యేలా శ్రీరామనవమికి రిలీజ్ చేస్తే ఇంకా రిలీజ్ టైమ్ యాప్ట్ అవుతుందని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా స్పందించలేదు.