భారత్ లో 100 కరోనా కేసులు..విద్యాసంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లు మూసివేత 

భారత్ లోనూ కరోనా విస్తరిస్తోంది. దేశంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. 100 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : March 15, 2020 / 02:29 AM IST
భారత్ లో 100 కరోనా కేసులు..విద్యాసంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లు మూసివేత 

భారత్ లోనూ కరోనా విస్తరిస్తోంది. దేశంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. 100 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. 151 దేశాలకు వైరస్ పాకింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 5,821 మంది చెందారు. లక్షా 56 వేల 433 మంది బాధితులు ఉన్నారు. 5 వేల 909 మందికి సీరియస్ అయింది. భారత్ లోనూ కరోనా విస్తరిస్తోంది. దేశంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. 100 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కరోనా బాధితులను ఆదుకోవాలని కేంద్రం నిర్ణయించింది. 

కరోనా మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా
కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కరోనా వైరస్‌ వల్ల మరణించిన వారి కుటుంబాలకు విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా సహాయమందిస్తారు. కరోనా వైరస్‌తో చికిత్స పొందుతున్న వారికి ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. పద్మ అవార్డులపై కరోనా ప్రభావం పడింది. ఏప్రిల్‌ 3న రాష్ట్రపతి భవన్‌లో జరగాల్సిన అవార్డుల ప్రదానోత్సవం వాయిదా పడింది.

విద్యా సంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లు మూసివేత
కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తుండడంతో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు బంద్ చేశారు. స్కూళ్లు, కాలేజీలు, మాల్స్,  థియేటర్లు, పబ్ లు, మాల్స్, స్విమ్మింగ్ పూల్స్ మూసివేశారు. పార్లమెంట్ సముదాయంలోకి సందర్శకులకు నో ఎంట్రీగా ప్రకటించారు. అంతర్జాతీయ సరిహద్దుల దగ్గర ఆంక్షలు విధించారు. భూటాన్ సరిహద్దును పశ్చిమబెంగాల్ మూసివేసింది. కరోనా విస్తరించకుండా ఈ నిర్ణయం తీసుకున్నాయి.