ముగిసిన ఐదోదశ పోలింగ్

  • Published By: venkaiahnaidu ,Published On : May 6, 2019 / 12:36 PM IST
ముగిసిన ఐదోదశ పోలింగ్

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముగిసింది.7రాష్ట్రాల్లోని 51లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-6,2019)పోలింగ్ జరిగింది.యూపీలోని 14,జార్ఖండ్ లోని 4,బీహార్ లోని 5,వెస్ట్ బెంగాల్ లోని 7,రాజస్థాన్ లోని 12,మధ్యప్రదేశ్ లోని 7,జమ్మూకశ్మీర్ లోని 2లోక్ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది.సాయంత్రం 5గంటల వరకు  యూపీలో 52.03శాతం,జార్ఖండ్ లో 58.24శాతం,వెస్ట్ బెంగాల్ లో 72.61శాతం,బీహార్ లో 52.86శాతం,జమ్మూకాశ్మీర్ లో అత్యల్పంగా 17.07శాతం,రాజస్థాన్ లో 58.93శాతం,మధ్యప్రదేశ్ లో 60.58శాతం పోలింగ్ నమోదైంది.మొత్తంగా 51లోక్ సభ స్థానాల్లో 58.02శాతం పోలింగ్ నమోదైంది.పోలింగ్ సందర్భంగా వెస్ట్ బెంగాల్,కశ్మీర్ లో పలుచోట్ల హింపాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఇవాళ పోలింగ్ జరిగిన స్థానాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు పోటీ చేస్తున్న అమేథీ,సోనియాగాంధీ పోటీ చేస్తున్న రాయబరేలి,కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ పొటీ చేస్తున్న లక్నో స్థానాలుకూడా ఉన్నాయి.