Viral News: దేవుడి పాదాలపై తలపెట్టి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి.. వీడియో వైరల్

రాజేష్ మెహానీ అనే వ్యక్తి మెడికల్ షాపు నిర్వాహకుడు అతడు సాయి భక్తుడు. ప్రతీ గురువారం దగ్గరలోని సాయి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేసేవాడు. ఎప్పటిలాగానే గుడికి వెళ్లాడు. ప్రార్థనల అనంతరం దేవుణ్ని దర్శించుకునేందుకు వెళ్లి ఆయన పాదాలపై తలపెట్టాడు. అలాగే ప్రాణాలు కోల్పోయాడు.

Viral News: దేవుడి పాదాలపై తలపెట్టి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి.. వీడియో వైరల్

Viral video

Viral News: మధ్యప్రదేశ్ రాష్ట్రం కట్నీ జిల్లాలో ఓ ఆలయంలో ప్రార్థనలు చేస్తుండగా గుండెపోటుతో వ్యక్తి మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేష్ మెహానీ వ్యక్తి మెడికల్ షాపు నిర్వాహకుడు. అతడు సాయి భక్తుడు. ప్రతీ గురువారం దగ్గరలోని సాయి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేసేవాడు. ఎప్పటిలాగానే గుడికి వెళ్లాడు. ప్రార్థనల అనంతరం దేవుణ్ని దర్శించుకునేందుకు వెళ్లి ఆయన పాదాలపై తలపెట్టాడు.

Viral Video: హృదయాన్ని కదిలించే వీడియో.. కూతురు ప్రేమకు కన్నీరు పెట్టుకున్న తండ్రి.. చిన్నారి చర్యకు నెటిజన్లు ఫిదా..

రాజేష్ మెహానీ దేవుడి పాదాలపై తలపెట్టి అలానే ఉండిపోయాడు. సుమారు 15 నిమిషాలు అలానే ఉండిపోవటంతో అనుమానం వచ్చిన మిగిలిన భక్తులు మెహానీని లేపేందుకు ప్రయత్నించగా ఎలాంటి ఉలుకుపలుకు లేదు. దీంతో భక్తులు, దేవాలయ సిబ్బంది దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. రాజేష్ మొహానీని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు.

అయితే అలా ఎందుకు చనిపోయాడనే కారణాలను పూర్తిస్థాయిలో వైద్యులు చెప్పలేకపోయినా.. గుండె నొప్పే కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం వాతావరణం నెలకొంది. ఇదిలాఉంటే మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో శుక్రవారంసైతం ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఓ బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావటంతో బస్సు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలిచియున్న వాహనదారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.