Bihar: ఆరేళ్ళ విద్యార్థిని చావబాదిన ఆ టీచర్ అరెస్ట్
Bihar: బిహార్లో ఆరేళ్ళ విద్యార్థిని ఓ ట్యూషన్ టీచర్ కర్రతో తీవ్రంగా కొట్టిన దృశ్యాలు ఇటీవల దేశ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ టీచర్ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఆ టీచర్పై దీనిపై కేసు నమోదు చేసిన ధనరువా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ విద్యార్థిని టీచర్ ఎందుకు కొట్టాడన్న విషయాన్ని కూడా మీడియాకు వివరించి చెప్పారు. టీచర్ అమర్ కాంత్ ఓ విద్యార్థినితో మాట్లాడుతుండగా ఆరేళ్ళ బాలుడు చూశాడు.
Maharashtra: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇంటి వద్ద భారీగా నిలిచిన వర్షపు నీరు
దీంతో తన బండారం బయపడుతుందని ఆగ్రహంతో ఊగిపోయిన అమర్ కాంత్ ఆ ఆరేళ్ళ బాలుడిని మొదట చేతులతో కొట్టాడు. అనంతరం ఓ కర్ర తీసుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో ఆ బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఒకరు చాటుగా తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
कोचिंग में बच्चे की डंडों से पिटाई करने वाले इस हैवान को पुलिस ने गिरफ़्तार कर लिया है. पिटाई की वजह हैरान करने वाली है.
दरअसल कथित शिक्षक एक छात्रा के साथ गंदी बातें कर रहा था जिसे इस छात्र ने देख लिया था. इसी बात से नाराज़ होकर इसने मासूम की बेरहमी से पिटाई की. pic.twitter.com/M4TnyeTbl4
— Utkarsh Singh (@UtkarshSingh_) July 7, 2022