BJP హామీలు : రైతులకు క్రెడిట్ కార్డులు, పెన్షన్లు, రూ.6వేల సాయం
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఏప్రిల్ 08వ తేదీ కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో దీనిని విడుదల చేశారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఏప్రిల్ 08వ తేదీ కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో దీనిని విడుదల చేశారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఏప్రిల్ 08వ తేదీ కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో దీనిని విడుదల చేశారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింఘ్, సుష్మా స్వరాజ్, కీలక నేతలు పాల్గొన్నారు. ‘సంకల్ప్ ప్రత్’ పేరిట ఈ మేనిఫెస్టో రూపొందించింది. దీనిలోని అంశాలను రాజ్ నాథ్ సింగ్ వివరించారు.
Read Also : తిట్టేది అభిమానంతో.. కొట్టేది ప్రేమతో : బాలయ్య భార్య వసుంధర
- పేద, మధ్య తరగతి రైతులకు పెన్షన్లు.
- రైతులకు వడ్డీ లేని రుణాలు, రైతు పెట్టుబడి సాయం కొనసాగింపు.
- జీరో పర్సెంట్ క్రెడిట్ కార్డులు.
- ఐదేళ్ల పాటు వడ్డీ లేకుండా లక్ష రూపాయల కిసాన్ క్రెడిట్ కార్డులు.
- 60 ఏళ్లు దాటిన రైతులు, చిన్న వ్యాపారులకు ఫించన్.
- పౌరసత్వం బిల్లుకు త్వరలో ఆమోదం.
- ఎలాంటి గుర్తింపు లేకున్నా పౌరసత్వానికి ఆమోదం.
- ఉగ్రవాదం నిర్మిలిస్తాం.
- సిటిజన్ షిప్ సవరణ బిల్లును ఆమోదిస్తాం.
- రామమందిరం నిర్మాణం త్వరగా అయ్యేలా చూస్తాం.
- 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం.
- డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ సిస్టమ్ అమలు.
- నీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తాం.
- యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
- అందరికీ ఉన్నత విద్య అందేలా ఏర్పాట్లు.
- అందరికీ విద్య. 75 కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తాం.
- ప్రజల సంఖ్యకు అనుగుణంగా వైద్యుల సంఖ్యను పెంచుతాం.
- ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై సింగిల్ విండో సిస్టం తీసుకొస్తాం.
- డిజిటల్ లావాదేవీలు పెంచుతాం.
- పంచతీర్థాల సర్క్యూట్ పూర్తి చేస్తాం.
- మహిళలకు ఉద్యోగ కల్పన పెంచుతాం.
- ట్రిపుల్ తలాక్ అంశంపై ముస్లిం మహిళలకు న్యాయం.
- 25 లక్షల కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు.
- రైతులందరికీ ఇన్ కం సపోర్టు రూ. 6వేలు ఇస్తాం.
Read Also : 2019 వరల్డ్ కప్.. టీమిండియా జట్టు ప్రకటన ఎప్పుడంటే?