UP: అత్యాచారం కేసులో బీఎస్‭పీ ఎంపీకి ఊరట

సంఘటన వివరాల ప్రకారం,.. 2019 మే 1న అతుల్ రాయ్, తదితరులపై అత్యాచారం కేసు నమోదైంది. వారణాసిలోని ఫ్లాట్‌కు తనను అతుల్ రాయ్ తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని, వీడియోలు, ఫోటోలు తీసి, ఆన్‌లైన్‌లో పెడతానంటూ బెదరించాడని పోలీసు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దీంతో 2019 జూన్ 22న కోర్టుకు రాయ్ లొంగిపోయారు. అప్పటి నుంచి ఆయన ప్రయాగరాజ్‌లోని నైని జైలులో ఉంటున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాల్ని బాధితురాలు సమర్పించలేదని కోర్టు పేర్కొంది.

UP: అత్యాచారం కేసులో బీఎస్‭పీ ఎంపీకి ఊరట

BSP Lok Sabha MP acquitted in case

UP: అత్యాచారం సహా మోసం, బెదిరింపు కేసులో విచారణ ఎదుర్కొంటున్న బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ అతుల్ కుమార్ సింగ్‭కి ఊరట కలిగింది. కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో 2019 నుంచి జైలులో ఉన్న ఆయన.. తాజాగా విడుదలయ్యారు. ఆయనపై మరిన్ని కేసులు ఉన్నప్పటికీ అవన్నీ పెండింగ్‭లో ఉన్నాయి. గత ఏడాది ఆగస్టులో 24 ఏళ్ల మహిళ తన స్నేహితుడితో కలిసి బీజేపీ ఎంపీపై కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో సాక్షి (బాధితురాలి స్నేహితుడు) గత ఏడాది సుప్రీంకోర్టు వెలుపల ఆత్మాహుతి చేసుకోవడంతో కాలిన గాయాలతో కన్నుమూశాడు. బాధితురాలి తరఫున ఎలాంటి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించలేదని, దీంతో నిందితుడిపై కేసు నిరూపణ కాలేదని జస్టిస్ చౌరాసియా తన తీర్పులో పేర్కొన్నారు.

సంఘటన వివరాల ప్రకారం,.. 2019 మే 1న అతుల్ రాయ్, తదితరులపై అత్యాచారం కేసు నమోదైంది. వారణాసిలోని ఫ్లాట్‌కు తనను అతుల్ రాయ్ తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని, వీడియోలు, ఫోటోలు తీసి, ఆన్‌లైన్‌లో పెడతానంటూ బెదరించాడని పోలీసు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దీంతో 2019 జూన్ 22న కోర్టుకు రాయ్ లొంగిపోయారు. అప్పటి నుంచి ఆయన ప్రయాగరాజ్‌లోని నైని జైలులో ఉంటున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాల్ని బాధితురాలు సమర్పించకపోవడంతో ఎంపీ అతుల్ కుమార్ సింగ్‭ను నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సియారాం చౌరాసియా తీర్పు వెలువరించారు.

BJP questions Rahul: అది సంఘీభావమా, స్టంటా?.. కాంగ్రెస్ నేత కాలర్ పట్టుకోవడంపై రాహుల్‭కు బీజేపీ ప్రశ్న