Tamil Nadu: ప్రమాదంలో గాయపడి బాలిక మృతి.. అంత్యక్రియల తర్వాత సమాధిలోంచి బాలిక తల మాయం

సమాధిలో పాతిపెట్టిన బాలిక మృతదేహానికి సంబంధించి తల మాయమైన ఘటన తమిళనాడులో జరిగింది. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిందో చిన్నారి. రెండు వారాల క్రితం అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పుడు చూస్తే బాలిక మృతదేహానికి తల లేదు.

Tamil Nadu: ప్రమాదంలో గాయపడి బాలిక మృతి.. అంత్యక్రియల తర్వాత సమాధిలోంచి బాలిక తల మాయం

Tamil Nadu: సమాధిలో పాతిపెట్టిన బాలిక మృతదేహం తల మాయమైన ఘటన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో ఇటీవల జరిగింది. మధురాంతకం సమీపంలోని, చిత్రావది అనే గ్రామంలో క్రితిక అనే పదేళ్ల బాలిక కొద్ది రోజుల క్రితం ప్రమాదానికి గురైంది.

Fire Haircut: ప్రాణాల మీదకు తెచ్చిన ‘ఫైర్ హెయిర్ కట్’.. తల ఎలా కాలిందో చూడండి.. వీడియో వైరల్

బాలిక ఇంటి దగ్గర ఆడుకుంటుండగా, విద్యుత్ పోల్ మీద పడి ఆమె తలకు తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు క్రితికను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ తొమ్మిది రోజులపాటు చికిత్స పొందిన బాలిక ఈ నెల 14న మరణించింది. తర్వాత బాలికకు కుటుంబ సభ్యులు ఈ నెల 15న అంత్యక్రియలు నిర్వహించారు. ఒక సమాధిలో పాతిపెట్టారు. అయితే, ఇటీవల ఆ సమాధిని ఎవరో తవ్వినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో అక్కడి పరిస్థితులు అనుమానాస్పదంగా అనిపించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు, రెవెన్యూ విభాగం, వైద్య సిబ్బంది.. అంతా కలిపి బాలిక సమాధిని తవ్వి చూసి నిర్ఘాంతపోయారు.

Rohit Sharma: యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. అత్యధిక సిక్సర్లతో కొత్త రికార్డు

బాలిక మృతదేహానికి తల లేదు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఘటనా స్థలంలో కొన్ని గ్లోవ్స్, టార్చ్‪లైట్ వంటి వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక తలను ఎవరైనా కుటుంబానికి శత్రువులు తీసుకెళ్లారా.. లేక క్షుద్రపూజల కోసం తీసుకెళ్లారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.