4రాష్ట్రాల హైకోర్టు సీజేఐల నియామకానికి కొలీజియం సిఫార్సు

  • Published By: venkaiahnaidu ,Published On : May 14, 2019 / 02:16 AM IST
4రాష్ట్రాల హైకోర్టు  సీజేఐల నియామకానికి కొలీజియం సిఫార్సు

నాలుగు రాష్ట్రాల హైకోర్టు చీఫ్ నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్‌  ఆర్‌ఎస్‌ చౌహాన్‌ ను తెలంగాణ హైకోర్టు సీజేగా నియమించాలని ప్రతిపాదించింది. తెలంగాణ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న జస్టిస్‌ వి.రామ సుబ్రమణియన్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు సీజేగా ప్రతిపాదించింది.మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఏఏ ఖురేషీని సిఫారసు చేసింది.ఢిల్లీ హైకోర్టు సీజేగా ప్రస్థుతం ఉన్న జస్టిస్ రాజేంద్ర మీనన్ త్వరలో పదవీ విరమణ పొందుతున్న కారణంగా  జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌ పేరును సీజేగా కొలిజియం సిఫారసు చేసింది.