ఢిల్లీ ర్యాలీ మృతుడి సంతాప సభకు ప్రియాంక గాంధీ

ఢిల్లీ ర్యాలీ మృతుడి సంతాప సభకు ప్రియాంక గాంధీ

congress-leader-priyanka

Priyanka Gandhi సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో భాగంగా జనవరి 26న జరిగిన ట్రాక్టర్​ ర్యాలీలో మరణించిన నవ్రీత్​ సింగ్​ కుటుంబాన్ని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. యూపీలోని రాంపుర్​ జిల్లా దిబ్​దిబా గ్రామంలో అతని కుటుంబం ఏర్పాటు చేసిన సంతాప సభకు గురువారం ప్రియాంక గాంధీ హాజరయ్యారు. నవ్రీత్ కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రియాంక. ప్రియాంక వెంట కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్​ లల్లు సహా పలువురు పార్టీ సీనియర్​ నేతలు ఉన్నారు

కాగా, ఆస్ట్రేలియాలో ఉండే నవ్రీత్ కి కొన్నాళ్ల క్రితం ఆ దేశంలోనే పెళ్లి అయింది. అయితే తన పెళ్లి వేడుకను సెలబ్రేట్ చేసుకునేందుకు కొద్ది రోజుల క్రితం నవ్రీత్ స్వస్థలానికి వచ్చాడు. అయితే తన బంధువులు రైతుల ఆందోళనల్లో పాల్గొనడంతో తాను కూడా వారి వెంట వెళ్లాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో జనవరి-26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నాడు. కానీ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి మరణించాడు.

అంతకుముందు, నవ్రీత్​ సంతాప సభకు వెళ్తుండగా ప్రియాంక గాంధీ కాన్వాయ్​ ప్రమాదానికి గురైంది. రాంపుర్​ వెళ్తుండగా ప్రియాంక కాన్వాయ్​.. జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు వీరేందర్​ చౌదరి కారును ఢీకొట్టింది. వెంటనే కాన్వాయ్​లోని నాలుగు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.ప్రమాదం తర్వాత.. మంచు కారణంగా దారి సరిగా కనిపించడం లేదని డ్రైవర్​ కారు ఆపగా… ప్రియాంక కారు దిగి వస్త్రంతో అద్దాన్ని తుడిచారు. కొద్దిసేపటి తర్వాత దిబ్​దిబా గ్రామానికి వెళ్లారు.