ఢిల్లీ ర్యాలీ మృతుడి సంతాప సభకు ప్రియాంక గాంధీ
Priyanka Gandhi సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో భాగంగా జనవరి 26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో మరణించిన నవ్రీత్ సింగ్ కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. యూపీలోని రాంపుర్ జిల్లా దిబ్దిబా గ్రామంలో అతని కుటుంబం ఏర్పాటు చేసిన సంతాప సభకు గురువారం ప్రియాంక గాంధీ హాజరయ్యారు. నవ్రీత్ కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రియాంక. ప్రియాంక వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ లల్లు సహా పలువురు పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు
కాగా, ఆస్ట్రేలియాలో ఉండే నవ్రీత్ కి కొన్నాళ్ల క్రితం ఆ దేశంలోనే పెళ్లి అయింది. అయితే తన పెళ్లి వేడుకను సెలబ్రేట్ చేసుకునేందుకు కొద్ది రోజుల క్రితం నవ్రీత్ స్వస్థలానికి వచ్చాడు. అయితే తన బంధువులు రైతుల ఆందోళనల్లో పాల్గొనడంతో తాను కూడా వారి వెంట వెళ్లాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో జనవరి-26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నాడు. కానీ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి మరణించాడు.
అంతకుముందు, నవ్రీత్ సంతాప సభకు వెళ్తుండగా ప్రియాంక గాంధీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. రాంపుర్ వెళ్తుండగా ప్రియాంక కాన్వాయ్.. జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు వీరేందర్ చౌదరి కారును ఢీకొట్టింది. వెంటనే కాన్వాయ్లోని నాలుగు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.ప్రమాదం తర్వాత.. మంచు కారణంగా దారి సరిగా కనిపించడం లేదని డ్రైవర్ కారు ఆపగా… ప్రియాంక కారు దిగి వస్త్రంతో అద్దాన్ని తుడిచారు. కొద్దిసేపటి తర్వాత దిబ్దిబా గ్రామానికి వెళ్లారు.
Rampur: Congress leader Priyanka Gandhi Vadra meets the family members of the farmer who lost his life during the tractor rally on 26th January in Delhi. pic.twitter.com/of2HTDKox6
— ANI UP (@ANINewsUP) February 4, 2021