Prasanth Kishore : కాంగ్రెస్కు అది దేవుడిచ్చిన హక్కు కాదు.. రాహుల్ని టార్గెట్ చేసిన పీకే
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ లో చేరికపై ఆ పార్టీ హైకమాండ్(సోనియా,రాహుల్,ప్రియాంక గాంధీ)తో
Prasanth Kishore : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ లో చేరికపై ఆ పార్టీ హైకమాండ్(సోనియా,రాహుల్,ప్రియాంక గాంధీ)తో ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘ చర్చలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ సీనియర్లు కొందరు దీనిని వ్యతిరేకించినట్లు తెలిసింది. అప్పటి నుంచి ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్పై వరుస విమర్శలు చేస్తున్నారు. మమతా బెనర్జీ మాదిరిగా కాంగ్రెస్ నాయకత్వంపై పీకే విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు.
గురువార్ ప్రశాంత్ కిషోర్ చేసిన ట్వీట్ లో…”దేశ రాజకీయాల్లో ప్రస్తుతం బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్న స్థానం కీలకం. కానీ కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేకించి ఓ వ్యక్తికే చెందిన దైవ హక్కు కాదు. గడిచిన పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ 90 శాతం ఎన్నికల్లో ఓటమి పాలైంది. విపక్షాలకు ఎవరు నేతృత్వం వహించాలో.. ప్రజాసామ్యయుతంగా నిర్ణయించాలి”అని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం దేశంలో యూపీఏ అనేదే లేదు అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన మరుసటి రోజే పీకే ఇలా ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక, ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ పై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ఆయన ట్వీట్ను ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా.. పీకేను సైద్ధాంతిక నిబద్ధత లేని వ్యక్తిగా అభివర్ణించారు. ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో పార్టీలకు ఆయన ఉచితంగా సలహాలు ఇవ్వొచ్చు కానీ.. మన రాజకీయాల అజెండాను ఆయన నిర్దేశించలేరని ఖేరా అన్నారు.
ALSO READ Congress : కాంగ్రెస్కి షాక్.. రాజీనామా చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి