BJP Tarun Chugh : మధ్యప్రదేశ్ లో శివ,విష్ణు ఉన్నారు..కరోనా ఏం చేయలేదు!

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ని కరోనా ఏమీ చేయలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి త‌రుణ్ చుగ్ అన్నారు.

BJP Tarun Chugh : మధ్యప్రదేశ్ లో శివ,విష్ణు ఉన్నారు..కరోనా ఏం చేయలేదు!

Mp

BJP Tarun Chugh మ‌ధ్య‌ప్ర‌దేశ్ ని కరోనా ఏమీ చేయలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి త‌రుణ్ చుగ్ అన్నారు. మధ్యప్రదేశ్ సీఎంగా శివ‌, బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా విష్ణు ఉండగామ‌ధ్య‌ప్ర‌దేశ్‌ను మ‌హ‌మ్మారి ఏం చేస్తుంద‌ని ఆదివారం ఓ ట్వీట్ లో తరుణ్ చుగ్ ప్ర‌శ్నించారు. కాగా మ‌ధ్యప్ర‌దేశ్ సీఎంగా శివ‌రాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా విష్ణుద‌త్ శ‌ర్మ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

మరోవైపు, మధ్యప్రదేశ్ లో ఈ ఏడాది జనవరి నుండి మే వరకు 3.28 లక్షల క‌రోనా మరణాలు సంభవించాయని,ఇది సాధారణ మరణాల రేటు కంటే 54శాతం ఎక్కువ అయినప్పటికీ బీజేపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తల నుండి ప్రశంసలు పొందడంలో మాత్రమే నిమగ్నమయ్యారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కరోనా వైరస్ వినాశనం చేస్తున్నప్పుడు.. శివరాజ్ మరియు విష్ణు దత్ ఎక్కడ ఉన్నారో చుగ్ మాకు చెప్పాలి? వారు నిద్రపోతున్నారా? భవిష్యత్తులో వారు మహమ్మారిని ఎలా అరికట్టగలరు? అని కాంగ్రెస్ ప్రతినిధి భూపేంద్ర గుప్తా ప్రశ్నించారు.