మళ్లీ పెళ్లి చేసుకోమంటే తల్లిని రాడ్‌తో కొట్టి చంపింది

మళ్లీ పెళ్లి చేసుకోమంటే తల్లిని రాడ్‌తో కొట్టి చంపింది

హైదరాబాద్‌లో ప్రియుడి మాటలు విని తల్లిని చంపిన ఉదంతం లాంటిదే ఢిల్లీలోనూ జరిగింది. ఆదివారం జరిగిన ఘర్షణలో కూతురే రాడ్ తో తల్లి తలపై కొట్టి చంపేసింది. ఢిల్లీలోని హరి నగర్ కు చెందిన నీరూ బగ్గా పవర్ డిస్కంలో అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్‌గా పనిచేస్తుంది. 

శనివారం మయాపూరిలోని ఖాజన్ బస్తీలో తలకు గాయం తగిలి ఉండడంతో స్థానికులు స్పందించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో తన తల్లి 81సంవత్సరాల సంతోష్ బగ్గాతో కలిసి ఉంటున్న ఆమెకు మధ్య ఆదివారం రాత్రి మరోసారి గొడవ అయింది. 
 
తల్లి ఎప్పుడూ భర్త నుంచి విడిపోయినందుకు గొడవ పడేదని కొన్నిసార్లు మళ్లీ పెళ్లి చేసుకోవాలని వాదించేది. గొడవ తీవ్రం కావడంతో నీరూ బగ్గా వృద్ధురాలైన తల్లిని రాడ్‌తో కొట్టి ఇంటి నుంచి పారిపోయింది. పోలీసులు వెళ్లి చూసేసరికి సంతోష్ బగ్గా శరీరం రక్తపు మడుగులో పడింది. ఈ మేర పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.