PM Modi : విశ్వవేదికపైకి మరిన్ని భారత విద్యా సంస్థలు
క్వాక్వారెల్లి సైమండ్స్ (క్యూఎస్) ప్రకటించిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ టాప్-200లో నిలిచిన భారత యూనివర్శిటీలను ప్రధాని మోడీ అభినందించారు.
PM Modi క్వాక్వారెల్లి సైమండ్స్ (క్యూఎస్) ప్రకటించిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ టాప్-200లో నిలిచిన భారత యూనివర్శిటీలను ప్రధాని మోడీ అభినందించారు. దేశంలోని మరిన్ని విశ్వవిద్యాలయాలను ప్రపంచ వేదికపై ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.
ఈ మేరకు బుధవారం ప్రధాని మోడీ ఓ ట్వీట్ చేశారు. యువతలో మేధో పరాక్రమానికి తోడ్పడే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని ట్వీట్ లో ప్రధాని పేర్కొన్నారు. క్యూఎస్ ర్యాంకింగ్స్ లో బెంగళూరు ఐఐఎస్సీ, ముంబై ఐఐటీ, ఢిల్లీ ఐఐటీ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.