పేదోడి ఫ్యూయల్ పై సబ్సీడీ ఎత్తివేసిన కేంద్రం!

పేదోడి ఫ్యూయల్ పై సబ్సీడీ ఎత్తివేసిన కేంద్రం!

kerosene పేదవాడి ఇంధనం “కిరోసిన్‌” సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ(PDS)లేదా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే కిరోసిన్‌పై సిబ్సిడీని పూర్తిగా ఎత్తివేస్తూ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ షాపుల్లో కూడా మార్కెట్ ధరలకే కిరోసిన్ ను అందించనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.

వాస్తవానికి ఇది అధికారిక ప్రకటన కాకపోయినా.. తాజాగా బడ్జెట్ కేటాయింపులను బట్టి ఇదే విషయాన్ని కేంద్రం నిర్ధారించింది. పేదలకు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే కిరోసిన్‌కు సబ్సిడీ కోసం ఏటా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపేవారు. అయితే ఈ ఏడాది ఆ కేటాయింపులు పూర్తిగా నిలిపివేశారు. దాంతో కిరోసిన్‌పై ఇప్పటి వరకు ఇస్తున్న సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసినట్లయింది.

కాగా, గత ఏడాది బడ్జెట్‌లో కిరోసిన్ సబ్సిడీ కోసం రూ. 2,677.32 కోట్లు కేటాయించారు. ఇది ఈ ఏడాది మార్చి 31 వరకు వర్తించనుంది. అయితే తాజా బడ్జెట్‌లో కేటాయింపులేవి లేకపోవండంతో ఏప్రిల్-1,2021 నుంచి కిరోసిన్‌ను మార్కెట్‌ రేటుకే అమ్మకాలు చేపడతారు. 2016లోనే కేంద్రప్రభుత్వం.. సబ్సీడీ భారాన్ని తగ్గించుకునేందుకు రాష్ట్రాలకు చెందిన ఫ్యూయల్ రీటైలర్లు ప్రతి రెండు వారాలకొకసారి లీటరు కిరోసిన్ పై 25పైసలు పెంచేందుకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే.