మాజీ ప్రధాని దంపతులకు కరోనా..ఫోన్ చేసి మాట్లాడిన మోడీ

జేడీఎస్​ పార్టీ అధినేత,మాజీ ప్రధానమంత్రి హెచ్​డీ దేవెగౌడకు కరోనా పాజటివ్​గా తేలింది.

మాజీ ప్రధాని దంపతులకు కరోనా..ఫోన్ చేసి మాట్లాడిన మోడీ

Hd Deve Gowda

HD Deve Gowda జేడీఎస్​ పార్టీ అధినేత,మాజీ ప్రధానమంత్రి హెచ్​డీ దేవెగౌడకు కరోనా పాజటివ్​గా తేలింది. ఆయన భార్య చెన్నమ్మకు కూడా కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని దేవెగౌడ.. ట్విట్టర్​లో తెలిపారు. ప్రస్తుతం ఇరువురు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు దేవెగౌడ పేర్కొన్నారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు, తన క్షేమం కోరేవారు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

కరోనా బారిన పడిన దేవెగౌడ దంపతుల ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరా తీశారు. ఫోన్​ చేసి వారితో మాట్లాడినట్లు మోడీ ట్వీట్​ చేశారు. ఇద్దరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ తెలిపారు. మోడీ ఫోన్​ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కాసేపటికే దేవెగౌడ ట్వీట్ చేశారు. దేశంలో నేను కోరుకున్న ఏ నగరంలోనైనా, ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స చేయించుకోవాలని మోడీ సూచించడం ఆనందకరం. నాకు బెంగళూరులో అంతా బాగుందని, ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తానని ఆయనకు చెప్పా అని దేవెగౌడ ట్వీట్ లో పేర్కొన్నారు.