లోయలో పడ్డ జీప్: ఐదుగురు మృతి
హిమచల్ప్రదేశ్లోని మండి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
హిమచల్ప్రదేశ్లోని మండి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
సిమ్లా : హిమచల్ప్రదేశ్లోని మండి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పద్దార్ ఏరియాలో ప్రయాణికులతో వెళ్తున్న జీప్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా హిమాచల్ ప్రదేశ్ లో చంబా జిల్లాలోని పంచపుల్ల వంతెన వద్ద పతంకోట్-డల్హౌసీ రూట్ లో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడిపోయింది. శనివారం (ఏప్రిల్ 27)న జరిగిన ఘటనలో 12 మంది మృతి చెందారు.
Also Read : బీ అలర్ట్ : వేడి వేడి టీ తాగుతున్నారా!
Himachal Pradesh: 5 people killed and 5 injured after a jeep rolled down a cliff into a deep gorge at Padhar area of Mandi district today. pic.twitter.com/sT70k3P2wH
— ANI (@ANI) May 2, 2019