లోయలో పడ్డ జీప్: ఐదుగురు మృతి

హిమచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 06:14 AM IST
లోయలో పడ్డ జీప్: ఐదుగురు మృతి

హిమచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

సిమ్లా : హిమచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పద్దార్  ఏరియాలో ప్రయాణికులతో వెళ్తున్న జీప్  అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా హిమాచల్ ప్రదేశ్ లో చంబా జిల్లాలోని పంచపుల్ల వంతెన వద్ద పతంకోట్-డల్హౌసీ రూట్ లో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడిపోయింది. శనివారం (ఏప్రిల్ 27)న జరిగిన ఘటనలో  12 మంది మృతి చెందారు. 
Also Read : బీ అలర్ట్ : వేడి వేడి టీ తాగుతున్నారా!