Rahul Gandhi: ‘భారత్ జోడో యాత్ర’ సిబ్బంది, సహాయకులకు రాహుల్ కానుకలు.. వెండి నాణేలు, స్వీట్లు బహూకరణ

రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, దీపావళిని పురస్కరించుకుని ఈ యాత్రలో పాల్గొంటున్న సిబ్బంది, సహాయకులకు రాహుల్ కానుకుల అందించాడు.

Rahul Gandhi: ‘భారత్ జోడో యాత్ర’ సిబ్బంది, సహాయకులకు రాహుల్ కానుకలు.. వెండి నాణేలు, స్వీట్లు బహూకరణ

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత నెల 7న తమిళనాడులోని, కన్యాకుమారిలో యాత్ర మొదలైంది. మరో రెండు రోజుల్లో యాత్రం 50వ రోజు పూర్తి చేసుకోబోతుంది.

WhatsApp: వాట్సాప్ సేవల పునరుద్ధరణ.. రెండు గంటల తర్వాత తిరిగి ప్రారంభమైన వాట్సాప్ సేవలు

ఈ నేపథ్యంలో, అలాగే దీపావళి సందర్భంగా రాహుల్ తన యాత్రలో వెంట వస్తున్న సిబ్బంది, సహాయకులకు కానుకలు అందించాడు. ప్రత్యేక లెటర్‌తోపాటు, వెండి నాణేలు, స్వీట్లను రాహుల్ గాంధీ వారికి కానుకగా అందించాడు. ఈ యాత్ర సందర్భంగా కొంత మంది యాత్ర ముగిసేవరకు ఆయనతోనే కొనసాగనున్నారు. అలాగే యాత్రలో రాహుల్ గాంధీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. అందుకే వారి సేవలను అభినందిస్తూ రాహుల్ లేఖలు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

West Bengal: బాల్ అనుకుని బాంబుతో ఆడుకున్న చిన్నారులు.. ప్రమాదవశాత్తు పేలి బాలుడి మృతి

రాహుల్ కానుకలు ఇచ్చిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. రాహుల్ చేసిన పనిని ప్రశంసించింది. ఇక, ‘భారత్ జోడో యాత్ర’ మొత్తం 3,750 కిలోమీటర్ల మేర సాగనుంది. దాదాపు 12 రాష్ట్రాల్లో సాగే ఈ యాత్ర వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది.