Pune Road Accident: పుణె-బెంగళూరు హైవేపై లారీ బీభత్సం.. 48వాహనాలు ధ్వంసం.. 30మందికి గాయాలు
పుణెలోని నవ్లే బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో వచ్చిన ఓ ట్యాంకర్ లారీ ముందు ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో 48 వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నారు. లారీ బీభత్సంతో కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి
Pune Road Accident: పుణెలోని నవ్లే బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో వచ్చిన ఓ ట్యాంకర్ లారీ ముందు ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో 48 వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటన ఆదివారం రాత్రి 9గంటల సమయంలో చోటు చేసుకుంది.
ఈ ప్రమాద సమాచారం అందుకున్న పుణె మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్యాంకర్ లారీ వేగంగా వెళ్తున్న క్రమంలో బ్రెకులు ఫెయిల్ కావటంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ట్యాంకర్ లోని ఆయిల్ రోడ్డుపై పడటంతో మిగిలిన వాహనాల టైర్లుజారి ఒకదానికొకటి ఢీకొన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
Horrible Accident at Navale Bridge Pune …. minimum of 20-30 vehicles involved pic.twitter.com/FbReZjzFNJ
— Nikhil Ingulkar (@NikhilIngulkar) November 20, 2022
ఈ ప్రమాదంలో గాయపడిని వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ముంబైకి వెళ్లే రహదారిపై రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.