బీర్ బాటిల్‌లో ప్రియురాలికి రక్తం బహుమానం

ప్రియురాలు మాట్లాడడం లేదని ఓ ప్రేమికుడు తన మణికట్టును కోసుకుని.. రక్తాన్ని బీర్‌బాటిల్‌లో నింపి ఆమెకు బహుమానంగా పంపించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

  • Published By: veegamteam ,Published On : August 30, 2019 / 03:27 PM IST
బీర్ బాటిల్‌లో ప్రియురాలికి రక్తం బహుమానం

ప్రియురాలు మాట్లాడడం లేదని ఓ ప్రేమికుడు తన మణికట్టును కోసుకుని.. రక్తాన్ని బీర్‌బాటిల్‌లో నింపి ఆమెకు బహుమానంగా పంపించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ప్రియురాలు మాట్లాడడం లేదని ఓ ప్రేమికుడు తన మణికట్టును కోసుకుని.. రక్తాన్ని బీర్‌బాటిల్‌లో నింపి ఆమెకు బహుమానంగా పంపించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నంగనల్లూరుకు చెందిన కుమారీశ పండియన్ కొన్ని సంవత్సరాల నుంచి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే కొద్ది వారాల నుంచి ఆ యువతి.. పండియన్‌తో మాట్లాడడం మానేసింది. సోషల్ మీడియాలో కూడా అతని కాంటాక్ట్‌ను బ్లాక్ చేసింది.

దీంతో అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తీవ్ర ఒత్తిడికి లోనైన పండియన్.. మంగళవారం తన స్నేహితుడైన ముత్తుకు విషయం చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. మద్యం సేవిస్తూనే.. తనకు తన ప్రేయసి చేసిన నష్టాన్ని ముత్తుకు వివరించాడు. మద్యం మత్తులో ఉన్న పండియన్.. బీర్ బాటిల్‌ను పగులగొట్టి తన మణికట్టును కోసుకున్నాడు. ఆ తర్వాత రక్తాన్ని మరో బీర్ బాటిల్‌లో పట్టాడు. ఈ రక్తాన్ని తన ప్రియురాలికి బహుమానంగా ఇవ్వాలని ముత్తును పండియన్ కోరాడు.

అయితే ఖాళీ బీర్ బాటిల్ ఇచ్చేందుకు ముత్తు నిరాకరించినప్పటికీ అతన్ని బెదిరించి బాటిల్‌ను తీసుకున్నాడు. ఇక తీవ్ర రక్తస్రావమైన పండియన్‌ను ముత్తు ఆస్పత్రికి తరలించాడు. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఆస్పత్రిలోనే పండియన్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.