Missing Posters : సిద్ధూ కనిపించడం లేదు..ఆచూకీ చెబితే..రూ. 50 వేలు

టీమిండియా మాజీ క్రికేటర్, పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూ కనిపించడం లేదు..ఎవరైనా ఆచూకీ చెబితే...వారికి రూ. 50 వేల నగదు ఇస్తాం..అంటూ పోస్టర్లు దర్శనమిస్తుండడం చర్చనీయాంశమైంది.

Missing Posters : సిద్ధూ కనిపించడం లేదు..ఆచూకీ చెబితే..రూ. 50 వేలు

Siddhu

Navjot Singh Sidhu : టీమిండియా మాజీ క్రికేటర్, పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూ కనిపించడం లేదు..ఎవరైనా ఆచూకీ చెబితే…వారికి రూ. 50 వేల నగదు ఇస్తాం..అంటూ పోస్టర్లు దర్శనమిస్తుండడం చర్చనీయాంశమైంది.

అమృత్ సర్ లో ఇలాంటి పోస్టర్లు కనిపిస్తున్నాయి. అమృత్ సర్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇతను ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే..ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని, అభివృద్ధి చేయడం లేదని ఆరోపిస్తూ…‘ధన్ ధన్ బాబా దీప్ సింగ్ జీ’ అనే ఓ స్వచ్చంద సంస్థ గోడలపై పోస్టర్లు అతికించింది. ఆయన ఆచూకీ చెప్పిన వారికి రూ. 50 వేలు నగదు బహుమతి అందచేస్తామని ఆ పోస్టర్లలలో పేర్కొంది.

అమృత్ సర్ ఈస్ట్ నియోజకవర్గంలో ఆయన కనిపించడం లేదని, ఈ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా చెత్త, మురుగునీరు ప్రవహిస్తోందని స్వచ్చంద సంస్థ ప్రతినిధి అనిల్ కుమార్ విశిత్ బంటి వెల్లడించారు. నియోజకవర్గాన్ని సిద్ధూ అసలు పట్టించుకోలేదని వెల్లడించారు.

నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఇలాంటి పోస్టర్లు వెలవడం ఇదే మొదటిసారి కాదు. గత పదేళ్ల క్రితం బీజేపీ ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి పోస్టర్లు దర్శనమిచ్చాయి. మరి..ప్రస్తుతం వెలిసిన పోస్టర్లపై సిద్ధూ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

Read More : Maharashtra E-Pass : మహారాష్ట్రలో ఈ-పాస్ తప్పనిసరి.. అప్లయ్ చేయండిలా..!