తల్లిని స్కూటర్ పై దేశ పర్యటనకు…ఆనంద్ మహీంద్రా బంపరాఫర్

  • Published By: venkaiahnaidu ,Published On : October 23, 2019 / 12:36 PM IST
తల్లిని స్కూటర్ పై దేశ పర్యటనకు…ఆనంద్ మహీంద్రా బంపరాఫర్

తల్లిదండ్రుల కోరికలను తీర్చే పిల్లలు చాలా తక్కువగా ఉంటారు. తల్లిదండ్రుల ఆశలు,కోరికలను వారు చెప్పకుండానే గమనించి వాటిని తీర్చే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి..మైసూర్ నివాసి అయిన డాక్టర్ కృష్ణకుమార్ గురించి సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు పరిచయం చేశారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర,నాందీ ఫౌండేషన్ సీఈవో మనోజ్ కుమార్. ఇవాళ(అక్టోబర్-23,2019)ఉదయం వాళ్లు ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మైసూర్ నివాసి అయిన కృష్ణకుమార్ బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తుండేవాడు. ఏళ్లుగా తన తల్లి చూడరత్నవంటగదికే పరిమితవడం గమనించాడు. తన తండ్రి చనిపోయేవరకు తల్లికి వంటగదే ప్రపంచమైందని అర్థం చేసుకున్నాడు. దీంతో తన తల్లి ఆమె జీవితమంతా కుటుంబం కోసమే గిడిపిందని,కనీసం ఇప్పుడైనా ఆమె కోరికలను,ఆశలను తీర్చాలనుకున్నాడు. ఓ రోజు నన్ను హంపీ తీసుకువెళ్తావా అని తల్లి అడగడంతో ఆమె మనసును అర్థం చేసుకున్నాడు. తన తల్లికి అసలు బయటి ప్రపంచంలోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాడు. గతేడాది జనవరిలో బ్యాంకు ఉద్యోగం మానేశాడు. తన బజాజ్ స్కూటర్ పై కూర్చోబెట్టుకుని దేశ పర్యటన మొదలుపెట్టాడు. ఏడు నెలల పాటు 48వేల 100 కిలోమీటర్లకు పైగా తన తల్లిని స్కూటర్ పై కూర్చోబెట్టుకుని దేశమంతా తిప్పి చూపించాడు. పర్యటన సమయంలో హోటల్స్ లో ఉండకుండా మఠాలలోనే ఉండేవాళ్లు. 

కృష్ణకుమార్,అతని తల్లి జర్నీ గురించి తెలుసుకున్న వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర చాలా సంతోషించారు. ఒక అందమైన కథ. ఒక తల్లి పట్ల ఉన్న ప్రేమ గురించి, ఒక దేశం పట్ల ఉన్న ప్రేమ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. కృష్ణకుమార్ కి వ్యక్తిగతంగా తానే మహీంద్రా KUV 100NXT కారుని గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దీంతో తర్వాతి జర్నీలో తన తల్లిని కృష్ణకుమార్ కారులో తీసుకెళ్లగలడని మహీంద్రా అన్నారు. మహీంద్రా ట్వీట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియా వేదికగా..మహీంద్రా చాలా మంచి పని చేస్తున్నారంటూ ఆయనన మెచ్చుకుంటున్నారు. గతంలో తమిళనాడులోని కోయంబత్తూరు రూపాయికే ఇడ్లీ అమ్ముతున్న అవ్వ గురించి తెలుసుకుని ఆమెకు ఆనంద్ మహీంద్రా ఉచితంగా గ్యాస్ ఇప్పించి దాని ఖర్చులు తానే భరిస్తానని ప్రకటించి నెటిజన్ల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.