ఉదయం 9గంటల వరకు : సిక్కింలో అత్యధికంగా పోలింగ్

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. 20రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 91 నియోజవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.

  • Published By: sreehari ,Published On : April 11, 2019 / 05:02 AM IST
ఉదయం 9గంటల వరకు : సిక్కింలో అత్యధికంగా పోలింగ్

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. 20రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 91 నియోజవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. 20రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 91 నియోజవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, చత్తీస్ గఢ్, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, మణీపూర్, మిజోరం, మేఘాలయ, ఒడిషా, సిక్కిం, తెలంగాణ, త్రిపుర, యూపీ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ ద్వీపం, లక్ష్యదీప్ రాష్ట్రాల్లో గురువారం (ఏప్రిల్ 11, 2019) ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది.

ఉదయం 9 గంటలకు నాగలాండ్ పార్లమెంటరీ నియోజవర్గంలో 21 శాతం వరకు అత్యధిక స్థాయిలో ఓటింగ్ నమోదైంది. లక్ష్యదీప్ లో 9.83 శాతం నమోదు కాగా, అండమాన్ నికోబార్ దీవుల్లో 5.83 శాతం వరకు నమోదైంది. అస్సాంలో 10.2 శాతం, అరుణాచల్ ప్రదేశ్ లో, తెలంగాణలో 10.6 శాతం,  13.3 శాతం, షాహరాన్ పూర్ లో 8 శాతం, కైరానాలో 10 శాతం, ముజప్ఫర్ నగర్ లో 10 శాతం,  సిక్కింలో 34 శాతం  మీరట్ లో 10 శాతం, బిజ్ నార్ లో 11శాతం, ఘాజియాబాద్ లో 11 శాతం, గౌతమ్ బుద్ధ్ నగర్ లో 12 శాతం వరకు ఓటింగ్ నమోదైంది.