గాంధీని చంపిన గాడ్సే, ప్రధాని మోడీ ఒక్కలాంటివారే : రాహుల్ గాంధీ

  • Published By: veegamteam ,Published On : January 30, 2020 / 09:47 AM IST
గాంధీని చంపిన గాడ్సే, ప్రధాని మోడీ ఒక్కలాంటివారే : రాహుల్ గాంధీ

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఇవాళ తన సొంత నియోజకవర్గమైన వయనాడ్‌లో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర ముగిసిన అనంతరం కల్పెట్టలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగించారు. 

మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్‌ గాడ్సే, ప్రధాని మోదీ ఇద్దరూ ఒకే భావజాలాన్ని నమ్ముతారని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఇవాళ తన సొంత నియోజకవర్గమైన వయనాడ్‌లో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర అనంతరం కల్పెట్టలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగిస్తూ..గాంధీని చంపిన గాడ్సే భావజాలాన్ని నమ్ముతానని చెప్పడానికి మోడీకి ధైర్యం లేదు. అంతే తప్ప వారిద్దకి వేరే ఎటువంటి తేడా లేదన్నారు రాహుల్‌. 

గాడ్సే తనకు తాను నమ్మలేదు.. కాబట్టే గాంధీని చంపేశాడు. గాడ్సే ఎవర్ని ప్రేమగా చూడేలేదు..తన గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోలేదు..మోడీ కూడా అంతే.ఈ విషయంలో మోడీ గాడ్సేతో సమానం. మోడీ తనకు తానే ప్రేమించుకుంటారు..తనకు ఇష్టమైన పనే చేస్తాడు. ప్రజల గురించి పట్టించుకోరు. అటువంటిదే పౌరసత్వ చట్ట సవరణ. అది భారతదేశంలో చాలామందికి ఇష్టంలేదు. కానీ మోడీ అదేమీ పట్టించుకోరు. దాని వల్ల ఎటువంటి పరిణామాలు వచ్చినా ఆయనకు అనవరం.తన ఇష్టానుసారంగా చేస్తారు. అందుకే మోడీ గాడ్సేలాంటి భావజాలం ఉన్నవారు. 

భారతీయులందరూ తాము భారతీయులం అని నిరూపించుకోవాల్సిన రోజులు వచ్చాయి. తాను భారతీయుడిని అని నిర్ణయించేందుకు మోడీ ఎవరు? అని రాహుల్‌ ప్రశ్నించారు. భారతీయుడా? కాదా? అని నిర్ణయించేందుకు మోడీకి ఎవరు లైసెన్స్‌ ఇచ్చారు? ప్రతీ భారతీయుడు తాను భారతీయుడినని నిరూపించుకోవాల్సిన దుస్థితికి తీసుకొచ్చారనీ ఇది మోడీ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని విమర్శించారు. 
భారతీయుడినని నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు రాహుల్‌ గాంధీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఉద్యోగాలు అడిగినప్పుడల్లా.. మోడీ యువత దృష్టిని మరలుస్తారని రాహుల్‌ విమర్శించారు. ఎన్నార్సీ, సీఏఏలతో యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ మండిపడ్డారు. దీనిపై ప్రశ్నిస్తే వారిపై దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారనీ విమర్శించారు రాహుల్ గాంధీ. తాము భారతీయులమని నిరూపించుకోవాల్సిన అవసరం ఏ భారతీయులకు లేదని అన్నారు.