బీజేపీకి లబ్ది చేకూర్చేదానికన్నా చచ్చిపోతాను

  • Published By: venkaiahnaidu ,Published On : May 2, 2019 / 11:47 AM IST
బీజేపీకి లబ్ది చేకూర్చేదానికన్నా చచ్చిపోతాను

యూపీలో బీజేపీకి లబ్ది చేకూర్చేదానికన్నా తాను చావడానికి సిద్దమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తెలిపారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ(మే-2,2019)ప్రియాంక రాయబరేలీలో పర్యటించారు.ఈ సందర్భంగా ఎస్పీ, బీఎస్పీ కూటమిని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డం వ‌ల్ల అది బీజేపీకి లాభ‌ప‌డుతుంది కాదా అని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ…ఏ ర‌కంగానూ బీజేపీకి హెల్ప్ చేసేది లేద‌ని, ఆ ప‌రిస్థితే రాదని సృష్టం చేశారు.యూపీలో బీజేపీ అభ్యర్థులపై కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను పోటీకి దించినట్లు తాను చెప్పలేదన్నారు.

సొంత బలంతోనే కాంగ్రెస్ ఒంట‌రిగానే ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తోంద‌ని తాను క్లియర్ గా చెప్పానన్నారు.బలంగా పోరాడగలిగే అభ్యర్థులను లేదా బీజేపీ ఓట్లు చీల్చే వాళ్లను తాము అభ్యర్థులుగా సెలక్ట్ చేసినట్లు ఆమె తెలిపారు. ప్ర‌తి ఒక కాంగ్రెస్ కార్య‌క‌ర్త బీజేపీ ఓటును మాత్ర‌మే చీలుస్తార‌ని, మ‌రొక‌రి ఓట్ల‌ను చీల్చ‌ర‌ని ఆమె అన్నారు. బీజేపీ లాంటి విధ్వంస‌క‌ర ఐడియాల‌జీతో ఎన్న‌టికీ కాంప్ర‌మైజ్ కాన‌న్నారు.