Modi : తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మోడీ పర్యటన

తౌటే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారు. పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలను ఈ తుఫాన్ అతాలకుతలం చేసింది.

Modi : తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మోడీ పర్యటన

Modi

Cyclone Tauktae : తౌటే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారు. పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలను ఈ తుఫాన్ అతాలకుతలం చేసింది. 2021, మే 19వ తేదీ బుధవారం గుజరాత్, డయ్యూ ప్రాంతాల్లో మోడీ పర్యటించనున్నారు. తుఫాన్ కారణంగా ఎలాంటి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మోడీ పర్యటననష్టం వాటిల్లిందో ఆయన తెలుసుకోనున్నారు.

ఉదయం 9.30 గంటలకు భావ్ నగర్ చేరుకుంటారు. అక్కడ్నించి ఉనా, డయ్యూ, జాఫరాబాద్, మహువా ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా వీక్షించనున్నారు. ఆపై అహ్మదాబాద్ లో తుపాను పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు మోడీ. తౌటే తుఫాన్ గుజరాత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. తీరాన్ని దాటే సమయంలో…గంటకు 190 కిలోమీటర్ల వేగంతో ప్రచండమైన గాలులు వీచాయి.

చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రోడ్లు, నివాస గృహాలు దెబ్బతిన్నాయి. ఈ తుఫాన్ ధాటికి గుజరాత్ లో ఏడుగురు మరణించారు. 16 వేళ్ల ఇళ్లకుపైగా దెబ్బతిన్నట్టు గుర్తించారు. ముందే ఎన్డీఆర్ఎఫ్, నేవీ, కోస్ట్ గార్డ్ దళాలు మోహరించి..సహాయక చర్యలు చేపట్టడంతో ప్రాణనష్టం తగ్గింది.