Sadhvi Saraswati : హిందువులంతా కత్తులు పట్టాలి.. సాధ్వి వివాదాస్పద వ్యాఖ్యలు

విశ్వ హిందూ పరిషద్(VHP)నాయకురాలు సాధ్వి స‌ర‌స్వ‌తి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. హిందువులందరూ తమ ఇళ్లను,గోవులను కాపాడేందుకు క‌త్తులు చేతబట్టాలని ఆమె కోరారు.

Sadhvi Saraswati : హిందువులంతా కత్తులు పట్టాలి.. సాధ్వి వివాదాస్పద వ్యాఖ్యలు

Sadvi

Sadhvi Saraswati :  విశ్వ హిందూ పరిషద్(VHP)నాయకురాలు సాధ్వి స‌ర‌స్వ‌తి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. హిందువులందరూ తమ ఇళ్లను,గోవులను కాపాడేందుకు క‌త్తులు చేతబట్టాలని ఆమె కోరారు.

ఆదివారం కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కర్కాలా గాంధీ మైదాన్ లో వీహెచ్ పీ,భజరంగ్ దళ్ కలిసి నిర్వహించిన హిందూ సంఘమ కార్యక్రమంలో పాల్గొన్న సాధ్వి స‌ర‌స్వ‌తి మాట్లాడుతూ…”ప్రపంచవ్యాప్తంగా గోమాత (ఆవు) గౌరవించబడుతుంది, కానీ కర్ణాటకలో మాంసం కోసం ఆవును చంపుతున్నారు. ఇలాంటి వధకులకు ఈ దేశంలో జీవించే హక్కు లేదు. హిందువుల గోశాలలో ఆయుధాలు చూపిస్తూ ఆవులను దొంగిలిస్తున్నారు. గోమాతను కాపాడేందుకు మనమందరం కత్తులు చేతబట్టాలి. ప్రజలు లక్షల రూపాయల విలువైన ఫోన్‌లను కొనుగోలు చేయగలిగినప్పుడు, వారు ఖచ్చితంగా కత్తులు కొనుగోలు చేయవచ్చు మరియు వాటిని వధించాలనుకునే వారి నుండి గోవులను రక్షించడానికి ఇళ్లలో ఉంచుకోవచ్చు” అని అన్నారు. గోశాల‌లో పుట్టిన తాను గోవ‌ధ‌ను అడ్డుకోవ‌డం బాధ్య‌త‌గా ముందుకెళ‌తాన‌ని సాధ్వి స‌ర‌స్వ‌తి పేర్కొన్నారు. దేశంలో గోవ‌ధ‌ను అరిక‌ట్ట‌డం, రామ మందిర నిర్మాణం జ‌ర‌గ‌డం అనే రెండు తీర్మానాల‌ను తాను చిన్న‌త‌నంలోనే తీసుకున్నాన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

కొందరు దేశ వ్యతిరేకులు కర్ణాటకలో టిప్పు సుల్తాన్‌ను ప్రశంసిస్తున్నారని…అటువంటి వారికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని సాధ్వి స‌ర‌స్వ‌తి సూచించారు. గోహత్య, మతమార్పిడి, లవ్ జిహాద్‌పై ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకురావాలని సాధ్వి స‌ర‌స్వ‌తి డిమాండ్ చేశారు. ప్రతి ఆత్మ భగవంతుని బిడ్డ అని, ప్రతి ప్రాణం దివ్యమని భగవద్గీత చెబుతోందని, భారత మాత మన భూమి అని, మనం లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా పోరాడాలి మరియు గోహత్యను అంతం చేయాలి అని సాధ్వి అన్నారు.

ALSO READ Parliamentary Panel : మోదీ ట్విట్టర్ హ్యాక్..అధికారులను ప్రశ్నించిన శశిథరూర్ కమిటీ