Supreme Court : కరోనా సోకిందా..దేశంలో ఎక్కడైనా ఆస్పత్రిలో చేరవచ్చు..

కోవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించింది.

Supreme Court : కరోనా సోకిందా..దేశంలో ఎక్కడైనా ఆస్పత్రిలో చేరవచ్చు..

Suprem Court

Centre’s Affidavit : మీకు కరోనా వచ్చిందా..అయితే..భారతదేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని రోగులకు కొంత ఊరట కలిగించే వార్త చెప్పింది కేంద్రం. ఎందుకంటే పలు రాష్ట్రాలు..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోవిడ్ పేషెంట్లను అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా సంక్షోభంపై సుప్రీంకోర్టులో సుమోటోగా విచారిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో..కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కోవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించింది. ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోయినా సరే..అంతేగాకుండా..కరోనా పాజిటివ్ రిపోర్టు లేకపోయినా..రోగిని చేర్చుకోమని ఏ ఆసుపత్రి నిరాకరించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆసుపత్రులు నడుచుకోవాలని సూచించింది.

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మూడెంచల మౌలిక సదుపాయాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. దేశంలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్ డోసుల సంఖ్య ఉందని..ఒక్క విడతలో దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేయకపోతున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ లో వెల్లడించింది.కోవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించింది.