భూమి కోసం అక్కను..చంటిబిడ్డను కూడా చంపేసిన చెల్లెలు

  • Published By: nagamani ,Published On : November 6, 2020 / 03:07 PM IST
భూమి కోసం అక్కను..చంటిబిడ్డను కూడా చంపేసిన చెల్లెలు

Tamilnadu woman killed sister and child : అక్క చెల్లెళ్లంటే ఒకరికి కష్టమొస్తే మరొకరు తోడుగా ఉంటారు. అక్కను అమ్మగా చెల్లిని కూతురిగా అక్కున చేసుకునే అక్కలను చూశాం. కానీ ఆస్తి కోసం అక్కను..ఆమె కూతుర్ని అత్యంత దారుణంగా హత్య చేసిన దారుణం తమిళనాడులో జరిగింది. ఆస్తి దక్కదనే కోపంతో అక్కను ఆమె కూతుర్ని చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించిన చెల్లెలి దారుణాన్ని పోస్ట్ మార్టం రిపోర్టు పట్టించింది.



వివరాల్లోకి వెళితే..తమిళనాడులోని కళ్లకురిచ్చికి చెందిన చిన్నస్వామి అనే వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూరుతు సుమతి..చిన్నకూతురు సుజాత. సుమతిని రాజా అనే దగ్గర బంధువుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇక చిన్న కూతురుకి పెళ్లిచేద్దామనుకున్నాడు. పెద్ద కూతురుకి ఓ పాప పుట్టింది. ఆ పాపకు శ్రీనిథి అని పేరు పెట్టి మనుమరాలితో ఆడుకుంటుండేవాడు చిన్నస్వామి.



అక్కకోసం బాధపడే తండ్రి భరించలేకపోయిన చెల్లి
ఈ క్రమంలో సుమతి అనారోగ్యంపాలైంది. దీంతో చిన్నస్వామి అనారోగ్యంతో ఉందని పెద్ద కూతురు బాగోగులు చూసుకుంటుండేవాడు. వైద్యం కోసం డబ్బులు కూడా ఖర్చుపెట్టేవాడు.కాపురం చేసుకునే కూతురు అలా అనారోగ్యం పాలవ్వటంతో చిన్నస్వామి తరచూ బాధపడేవాడు. ‘‘చూశావా సుజాతా..అక్కకు అనారోగ్యంతో బాధపడుతోంది…అది బాగుపడితే దాని కాపురం అది చేసుకుంటుంది..అప్పటిదాకా మనంకూడా దాని గురించి ఆలోచించాలి’’అని చిన్నకూతురు సుజాతకు చెబతుండేవాడు. అస్తమాను అక్క గురించే తండ్రి మాట్లాడుతుంటే సుజాతకు నచ్చేది కాదు. అనారోగ్యంతో బాధపడే అక్కపై సానుభూతి చూపించి సేవలు చేయాల్సిన చెల్లెలు అక్కపై అక్కసు పెంచుకుంది.పైగా తండ్రికి ఉన్న కొద్దిపాటి భూమి అమ్మేసి అక్క వైద్యానికే తగలేసేలా ఉన్నాడనుకుని మండిపోయేది సుజాతకు.


అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుందని నమ్మిన తండ్రి
ఈక్రమంలో సుమతి, ఆమె కూతురు శ్రీనిధి ఎవ్వరూ ఊహించని విధంగా మంటల్లో కాలి చనిపోయారు. దీంతో తండ్రి గుండె బద్దలైపోయింది. కూతురు మనుమరాలి కోసం ఏడ్చాడు. ఇంటికి పెద్ద కూతురు చనిపోవటంతో చిన్నస్వామి కృంగిపోయాడు. అనారోగ్య సమస్యల కారణంగానే సుమతి కూతురితో సహా ఆత్మహత్య చేసుకుందని తండ్రితో పాటు అంతా అనుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టంకు పంపించారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్టులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.


శరీరాలపై కత్తిపోట్లు..పోస్టు మార్టం రిపోర్ట్ లో వెల్లడైన షాకింగ్  విషయాలు
సుమతి, ఆమె కూతురి శ్రీనిథి శరీరాలపై కత్తిపోట్లు ఉన్నాయని రిపోర్టులో తేలింది.దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సుమతి చెల్లెలు సుజాతపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమ శైలిలో విచారించగా అసలు విషయం బైటపెడ్టింది. అక్కను ఎంత దారుణంగా హతమార్చి కిరోసిన పోసి నిప్పు పెట్టిందో సుజాత చెబుతుంటే విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు.



అక్కను ఎందుకు చంపిందంటే..
ఇద్దరు కూతుళ్లు ఉన్న చిన్నస్వామికి గ్రామంలో 20 సెంట్లు స్థలం ఉంది. అక్క ఆరోగ్యం బాగోకపోవడంతో తండ్రి ఆమె కోసం డబ్బులు ఖర్చుపెట్టటం చూసిన సుజాత మండిపడిపోయేది.కానీ పైకి కనపడనిచ్చేది కాదు. ఈ క్రమంలో పెళ్లి చేసి పంపించేసి కూతురు కోసమే తండ్రి తపించిపోతున్నాడు. ఉన్న కొద్దిపాటి స్థలంతో తనకు పెళ్లి చేయాలి…కానీ అక్కకోసం తప్పించిపోయే తండ్రి తనకు చెప్పకుండా 20 సెంట్ల భూమి కూడా అమ్మేస్తాడేమోనని సుజాతలో అనుమానం మొదలైంది.ఆ అనుమానంతో అక్కపై కోపం పెంచుకుంది.



కత్తితో నరికి కిరోసిన్ పోలీ కాల్చేసిన సుజాత
అనారోగ్యంతో ఉన్న అక్కను చంపేస్తే భూమి మిగులుతుందని భావించింది. అలా అనారోగ్యంతో పుట్టింటికి వచ్చిన అక్క సుమతి, ఆమె కూతురు శ్రీనిధి నిద్రపోతున్న సమయంలో తండ్రి ఇంటివద్ద లేకపోవటాన్ని అదను చూసుకుని కత్తితో వారిద్దరినీ నరికి చంపేసింది. ఆ తరువాత ఎవ్వరికీ అనుమానం రాకుండా వారిపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్మహత్య చేసుకున్నట్లు అందరినీ నమ్మించింది. ఆరోగ్య సమస్యల కారణంగానే తన అక్క ఆత్మాహుతి చేసుకుందంటూ మొసలి కన్నీరు కార్చింది. పోస్టుమార్టం రిపోర్ట్‌‌తో చెల్లెలి నాటకానికి తెరపడింది. అనంతరం గురువారం (నవంబర్ 5,2020) పోలీసులు సుజాతను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.