మథుర, కాశీ దేవాలయాలు కూడా విముక్తి పొందాలి

  • Published By: venkaiahnaidu ,Published On : August 5, 2020 / 07:52 PM IST
మథుర, కాశీ దేవాలయాలు కూడా విముక్తి పొందాలి

అయోధ్యలో రామాలయానికి భూమి పూజ వైభవంగా జరగడంతో దేశ ప్రజలతోపాటుగా బీజేపీ నేతలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇకపై కాశీ విశ్వనాథుని దేవాలయం, మధురలోని శ్రీకృష్ణ దేవాలయాలను విముక్తి చేయడం కోసం పోరాటం జరుగుతుందనే సంకేతాలు ఇస్తున్నారు.

అయోధ్య విషయంలో హిందువుల కల నెరవేరిందని, ఏదో ఓ రోజు కాశీ, మధుర విషయంలో కూడా కలలు సాకారమవుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు కర్ణాటక పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప. శ్రీకృష్ణుడు, కాశీ విశ్వనాథుడు విముక్తి పొందుతారని, దేవాలయాలు నిర్మితమవుతాయని అన్నారు.

బుధవారం శివమొగ్గ జిల్లాలో మంత్రి కేఎస్ ఈశ్వరప్పమాట్లాడుతూ….బానిసత్వం యొక్క గుర్తు తొలగించబడింది. కాశీ మరియు మధుర వద్ద మరో రెండు మిగిలి ఉన్నాయి, వీటిని (చెరిపివేయాలి) మరియు మసీదులు మందిరాలకు దారి ఇవ్వాలి అని అయన అన్నారు. వారణాసిలోని కాశీ విశ్వనాథుని దేవాలయంలోనూ, మధురలోని కృష్ణ దేవాలయంలోనూ బానిసత్వ సంకేతాలు కనిపిస్తున్నాయని,ఈ రెండు దేవాలయాల కోసం యావత్తు దేశం కలలు కంటోందని చెప్పారు.

ఈ రెండు దేవాలయాలను తాను సందర్శించినట్లు తెలిపారు. అవి బానిసత్వంలో ఉన్నట్లు, అక్కడి మసీదులు పవిత్ర ప్రదేశంలో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. మధురలోని దేవాలయంలో గోడను చూసినపుడు మనం ఇంకా బానిసలుగానే బతుకుతున్నట్లు అనిపిస్తుందన్నారు. అయోధ్య విషయంలో హిందువుల కల నెరవేరిందని, ఏదో ఓ రోజు కాశీ, మధుర విషయంలో కూడా కలలు సాకారమవుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమి పూజ చేయడం పట్ల ఈశ్వరప్ప హర్షం వ్యక్తం చేశారు. రామాలయానికి శంకుస్థాపన చేసిన ఈ రోజు చాలా శుభ దినమని తెలిపారు. అయోధ్యలో దివ్యమైన, భవ్యమైన రామాలయం నిర్మితమవుతుందని చెప్పారు.