Mumbai : నరేంద్ర మోడీతో ఫోన్ చేయించనా? అంటూ..మద్యంతాగి బైక్ నడుపుతూ మహిళ వీరంగం
ఫుల్గా మద్యం తాగి అతివేగంగా బైక్ నడుపుతున్న ఓ యువతి ముంబయిలో హల్చల్ చేసింది. అడ్డగించిన ట్రాఫిక్ పోలీసులపై చిందులు తొక్కింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
Mumbai : ఫుల్ గా మద్యం తాగిన ఓ యువతి ముంబయిలో వీరంగం సృష్టించింది. అతివేగంగా బైక్ నడుపుతున్న ఆమెను ఆపినందుకు ట్రాఫిక్ పోలీసులపై విరుచుకుపడింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసారు.
ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో ఒక్కోసారి ఫన్నీ ఇన్సిడెంట్స్ బయటపడుతుంటాయి. కొందరు మందుబాబులు వేసే విన్యాసాలు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఆర్కిటెక్ట్ అయిన ఓ యువతి మద్యం తాగి అతివేగంగా బైక్ నడుపుతూ పోలీసులకు చుక్కలు చూపించింది. బ్రాంద్రా-వర్లీ సీ లింక్పై ఈ సంఘటన చోటు చేసుకుంది.
జబల్ పూర్కి చెందిన నుపుర్ ముఖేష్ పటేల్ అనే యువతి బాంద్రా-వర్లీ సీ లింక్పై వేంగంగా వెళ్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు ఆమెను నిలిపివేసారు. అంతే.. ఇంక ఆ యువతి పోలీసులను దుర్భాషలాడిన వీడియో వైరల్ అవుతోంది. ‘నా బండినే ఆపుతారా?’ అంటూ అరవడం మొదలుపెట్టింది. ‘నరేంద్ర మోడీ నాకు ఫోన్ చేసి బైక్ ఆపమని చెబితే చేస్తాను.. వెళ్లి మోడీని పిలవండి’ అంటై బైక్ ఆపడానికి నిరాకరించింది. ‘నా బైక్ ముట్టుకుంటే చేయి నరికేస్తాను.. నా బైక్ పై చేయి వేయడానికి నీకు ఎంత ధైర్యం’ అంటూ పోలీసుపై మాటలతో చెలరేగిపోయింది. అతివేగంగా బైక్ నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులతో అనుచితంగా ప్రవర్తించి ధూషించినందుకు 26 ఏళ్ల ఆర్కిటెక్ట్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
This is sheer brazenness and rude, her language for Mumbai Traffic police on duty is disgusting, glad she has been arrested. Screams at the cops saying she’s from the government of Bharat. pic.twitter.com/5I2mVXEjXt
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) September 24, 2023