Maharashtra: ‘పోలీస్ అంకుల్ మా అమ్మే నాన్న‌ను చంపింది’

వివాహేతర సంబంధం మోజులోపడి కట్టుకున్న భర్తను కన్న కూతురు ముందే కడతేర్చిందో మహిళ.. ఈ ఘటన ముంబై నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ గోండా జిల్లాకు చెందిన భార్య భ‌ర్త‌లు షాహిదా షేక్‌, రీస్ షేక్‌.

Maharashtra: ‘పోలీస్ అంకుల్ మా అమ్మే నాన్న‌ను చంపింది’

Maharashtra

Maharashtra: వివాహేతర సంబంధం మోజులోపడి కట్టుకున్న భర్తను కన్న కూతురు ముందే కడతేర్చిందో మహిళ.. ఈ ఘటన ముంబై నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ గోండా జిల్లాకు చెందిన భార్య భ‌ర్త‌లు షాహిదా షేక్‌, రీస్ షేక్‌. వీరికి ఆరేళ్ళ పాప, రెండేళ్ల బాబు ఉన్నాడు. జీవనోపాధి నిమిత్తం వీరు ముంబైకి వలస వచ్చారు. భ‌ర్త రీస్ షేక్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే భార్య షాహిదా షేక్‌ వేరేకరిమీద మనసు పారేసుకుంది.

ఇంటిపక్కనే ఉండే అమిత్ మిశ్రాతో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండటంతో.. అతడిని హత్య చెయ్యాలని ప్రియుడితో కలిసి పథకం పన్నింది. కూతురు ముందే ప్రియుడితో కలిసి భ‌ర్త రీస్ షేక్ ను అత్యంత దారుణంగా హత్యచేసి ఇంట్లో పూడ్చిపెట్టింది. అనంతరం ఏమి తెలియనట్లుగా తన భర్త కనిపించడం లేదంటూ దహిసర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రీస్ షేక్ కోసం గాలింపు మొదలు పెట్టారు. ఇదే సమయంలో రీస్ షేక్ సోదరుడు ఇంటికి వచ్చాడు. వదిన ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను నిలదీశాడు.. ఆమె పొంతనలేని సమాధానం చెప్పడంతో ద‌హిస‌ర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే రీస్ షేక్ కూతురిని పక్కకు పిలిచి తన తండ్రి గురించి అడిగారు.

ఆ పాప కంట నీరుపెట్టుకుంటూ పోలీస్ అంకుల్ మా నాన్నను మా అమ్మ అదిగో ఆ తీగతో గొంతుకు బిగించి, కత్తితో పొడిచి చంపింది అంటూ అమాయకంగా చెప్పింది. దీంతో పోలీసులు షాహిదా షేక్‌ ను తమదైన శైలిలో విచారించడంతో నేరం ఒప్పుకుంది. తన భర్తను ప్రియుడితో కలిసి హత్యచేసినట్లు తెలిపింది. ఇంట్లోనే పూడ్చినట్లుగా వివరించింది. దీంతో మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.

షాహిదా షేక్‌ ఆమె ప్రియుడు అమిత్ లను పోలీసులు అదుపులోకి తీసుకోని హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. తండ్రి మృతి చెంది.. తల్లి జైలుకు పోవడంతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు.