కాంగ్రెస్ పార్టీ కి మరో ఝలక్ : కారెక్కిన అరికెల నర్సారెడ్డి 

మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అరికెల నర్సారెడ్డి  శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.  టీఆర్ఎస్  పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు  పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

  • Published By: chvmurthy ,Published On : March 29, 2019 / 11:09 AM IST
కాంగ్రెస్ పార్టీ కి మరో ఝలక్  : కారెక్కిన అరికెల నర్సారెడ్డి 

మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అరికెల నర్సారెడ్డి  శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.  టీఆర్ఎస్  పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు  పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అరికెల నర్సారెడ్డి  శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.  టీఆర్ఎస్  పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు  పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. త్వరలో తన అనుచరులను, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని టీఆర్ఎస్ పార్టీలో చేర్పించేందుకు  భారీ ఎత్తున ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు.
Read Also : భ్రష్టు పట్టిస్తోంది : ఏంటీ ‘Bigo Live’.. మాయలో కుర్రోళ్లు

నర్సారెడ్డి టీఆర్ఎస్ లో చేరటం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్, పార్టీ నర్సారెడ్డికి  సముచిత గౌరవం కల్పిస్తుందని చెప్పారు. నిజామాబాద్ కు చెందిన అరికెల నర్సారెడ్డి గతంలో టీడీపీలో ఉండగా ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. 2016 లో టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా ఆయన సేవలందించారు. టీఆర్ఎస్ లో చేరటంపై  నర్సారెడ్డి మాట్లాడుతూ  కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృధ్ది సంక్షేమ పధకాలు  నచ్చి  పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.  రాబోయే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 స్ధానాలను గెలుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. 
Read Also : ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి : జియో టాప్ 5 డేటా ప్లాన్ ఆఫర్లు ఇవే