జగన్ చాలా పెద్ద తప్పు చేశారు:గంటా వ్యాఖ్యలు
విశాఖపట్నం: 2019 ఎన్నికలకు ముందు జగన్ అతి పెద్ద తప్పు చేశారని,మొదటి నుంచి సెల్ఫ్ గోల్స్ వేసుకోవడం జగన్ కు అలవాటు మారిందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జగన్ కేటీఆర్ భేటీ పై ఆయన మాట్లాడుతూ.. జగన్ సెల్ఫ్ గోల్ నుంచి బయటపడే అవకాశమే లేదని,ఈ ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలుగుతల్లిని, ఏపీ సంస్కృతి సంప్రదాయాలను కేసీఆర్ కించపరిచారని, ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒక మిథ్య అని గంటా అభిప్రాయపడ్డారు. జగన్ కు ఏపీలో ఓట్లు అడిగే హక్కు లేదని గంటా మండిపడ్డారు. తలకిందలుగా తపస్సు చేసినా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ఏం చేయలేరని,వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు భారీ మెజారిటీతో గెలవనున్నారని గంటా చెప్పారు .