Tirupati : శోభాయమానంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం
తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం శోభాయమానంగా జరిగింది.

Tirupati : తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 3గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు ఆలయంలోని ఊంజల మండపంలో అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగం శాస్త్రోక్తంగా జరిగింది.
తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 11 రకాల పుష్పాలు, ఐదు రకాల పత్రాలు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పుష్పాలు విరాళంగా అందాయి. మొదటగా అర్చకులు 108 సార్లు విష్ణుగాయత్రి మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల ప్రకృతిమాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా స్వామివారు కరుణిస్తారని నమ్మకం. పుష్పయాగం అనంతరం శ్రీసీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు.
Also Read : TTD: మే 25 నుంచి 29 వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు
- నేడు ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల
- Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల
- Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త రూ.300 దర్శనం టికెట్లు కొద్దిసేపట్లో విడుదల
- Tirumala : మే 21 న రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
- TTD EO Dharma Reddy : టీటీడీ కీలక నిర్ణయం.. కొత్త సాఫ్ట్వేర్, డిస్కౌంట్ రేట్లు
1IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
2Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
3Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో అన్నెం సాయిపై మరో కేసు నమోదు
4Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
5Nara Lokesh On Scams : మహానాడు తర్వాత కుంభకోణాలు బటయపెడతా-నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
6Hanuman Jayanti 2022 : మే 29న ధర్మగిరిలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం
7NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
8ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
9Adimulapu Suresh On Mahanadu : మహానాడు కాదు మాయనాడు, టీడీపీకి నామరూపాలు ఉండవు- మంత్రి సురేశ్
10Genelia: చిరునవ్వుతో గుండెల్ని దోచేస్తున్న జెనీలియా!
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్కు ముహూర్తం ఫిక్స్
-
Love Jihad in Karnataka: కర్ణాటకలో మరో లవ్ జిహాద్ ఘటన: వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
-
F3: ఎఫ్3 రెస్పాన్స్పై చిత్ర యూనిట్ హ్యాపీ!
-
Ambassador Car: మళ్లీ భారత్ రోడ్లపైకి రానున్న అంబాసిడర్ కార్లు: ఈసారి ఎలక్ట్రిక్ వేరియంట్లలో